Don't Miss!
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- News దేశ రాజకీయాల్లో ఆ ఘనత సాధించిన ఒకేఒక్కడు పవన్ కళ్యాణ్
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
ఆ విషయంలో లేడీస్ టైలర్ను అనుసరించిన ఓ పిట్ట కథ.. మార్చి 6న ట్రీట్ రెడీ!
అగ్ర నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఓ పిట్ట కథ. ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకుడు. వి.ఆనందప్రసాద్ నిర్మాత. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు హీరోలుగా, నిత్యాశెట్టి హీరోయిన్గా నటించారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రిలీజైన టీజర్ కి అద్భుత స్పందనవచ్చింది. ఏమై పోతానే.. మనసిక ఆగేలా లేదే అంటూ సాగే మెలోడీ పాటను
బుట్టబొమ్మ పూజా హెగ్డే చేతులమీదుగా వేలెంటైన్స్ డే రోజున విడుదల చేయగా ఫీల్ గుడ్సాంగ్ అన్న ప్రశంసలు దక్కాయి. ఈ సాంగ్ చిత్రీకరణలో ఓ ఆసక్తి కర సంగతిని నిర్మాత ఆనంద ప్రసాద్ వెల్లడించారు. ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ-ఈ పాటను అమలాపురం, కాకినాడ పరిసరాల్లో చిత్రీకరించాం. పాట చిత్రీకరణలో ఓ తమాషా ఉంది. మూవీలో సన్నివేశం మూడ్ కి తగ్గట్టుగా అక్కడ లొకేషన్లలో విజువల్స్ ని తెరకెక్కించాం. తొలుత విజువల్స్ షూట్ చేశాకే హైదరాబాద్ లో ట్యూన్ కట్టాం. ఇలా ఇంతకుముందు ప్రముఖ దర్శకుడు వంశీ లేడీస్ టైలర్ కోసం ''ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే '' పాటలో ప్రయోగం చేశారు. విజువల్స్ షూట్ చేసాక ఇళయరాజాతో ఆ బాణీని సిద్ధం చేయించారు వంశీ గారు. ఆ తరహాలోనే మేం చేసిన ప్రయోగం అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాం. మార్చి 6న సినిమాని రిలీజ్ చేస్తున్నాం అని తెలిపారు.
దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ.. ఒక విలేజ్లో జరిగే కథ ఇది. ప్రతి సన్నివేశం కడుపుబ్బ నవ్విస్తూనే.. ఏం జరుగుతోందో అనే ఉత్కంఠను కలిగిస్తుంది. పతాకసన్నివేశాల వరకూ అదే థ్రిల్ కొనసాగుతుంది. ట్విస్టులు థ్రిల్ కలిగిస్తాయి. స్క్రీన్ ప్లే ప్రధానంగా తెరకెక్కించాం అని అన్నారు.
నటీనటులు:
విశ్వంత్
దుద్దుంపూడి,
సంజయ్రావు,
నిత్యాశెట్టి,
బ్రహ్మాజీ,
బాలరాజు,
శ్రీనివాస్
భోగిరెడ్డి,
భద్రాజీ,
రమణ
చల్కపల్లి,
సిరిశ్రీ,
సూర్య
ఆకొండి
తదితరులు..
సాంకేతిక
నిపుణులు:
పాటలు:
శ్రీజో
,
ఆర్ట్:
వివేక్
అన్నామలై,
ఎడిటర్:
డి.వెంకటప్రభు,
కెమెరా:
సునీల్
కుమార్
యన్.,
సంగీతం:
ప్రవీణ్
లక్కరాజు,
ఎగ్జిక్యూటివ్
ప్రొడ్యూసర్:
అన్నే
రవి,
నిర్మాత:
వి.ఆనంద
ప్రసాద్.
కథ,
స్క్రీన్ప్లే,
మాటలు,
దర్శకత్వం
:
చెందుముద్దు