Don't Miss!
- Sports దూబెకు అన్యాయం..ఇది భారత్కే మంచిది కాదు- రోహిత్
- News మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
- Finance Stock Market: ఊపిరి పీల్చుకున్న బుల్స్.. లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ.. ట్రెండిగ్లో జస్ట్డయల్..
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Technology Motorola నుంచి రెండు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్! ధర, ఫీచర్లు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
‘మదర్ థెరిస్సా’ జీవితంపై సినిమా రాబోతోంది, వివరాలు ఇవే..
అత్యంత ప్రతిష్టాత్మమైన నోబెల్ పురస్కారం అందుకుని భారతదేశానికే కీర్తి తెచ్చిన ప్రముఖుల్లో మదర్ థెరిసా ఒకరు. మానవాళిని దారిద్య్రం, బాధల నుంచి విముక్తి కల్పించటానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఈ బహుమతి దక్కింది. సేవాగుణంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన మదర్ థెరిస్సా జీవితంపై త్వరలో బాలీవుడ్ మూవీ రాబోతోంది.
ఈ చిత్రానికి సీమా ఉపాధ్యాయ్ దర్శకత్వం వహించబోతున్నారు. ప్రదీప్ శర్మ, నితిన్ మన్మోహన్, గిరీష్ జోహార్, ప్రాచీ మన్మోహన్ నిర్మించబోయే ఈ బయోపిక్లో బాలీవుడ్, హాలీవుడ్ నుంచి ప్రముఖ స్టార్స్ నటించబోతున్నారు.
ఆర్య, సాయేషా పెళ్లి సందడి.. సంగీత్లో అల్లు అర్జున్ కేక.. బుగ్గపై ముద్దుపెట్టి..!
ఓ ఆంగ్ల పత్రికతో డైరెక్టర్ సీమా ఉపాధ్యాయ్ మాట్లాడుతూ... ప్రజలను సేవా మార్గంలో నడిపించడంలో మదర్ థెరిస్సా ఎంత కృషి చేశారు. ఆమె ఈ ప్రపంచంలో ఎంతో మందికి స్పూర్తి. ఒక మామూలు మహిళ అంత పెద్ద సేవా సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారు అనే విషయాలను వెల్లడిస్తూ ఈ చిత్రం సాగుతుందని తెలిపారు.
ఈ బయోపిక్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించబోతున్నాం. మదర్ థెరిసా జన్మించిన ఆల్బేనియా దేశంలోని 'స్కోయె' పట్టణంతో పాటు పారిస్, ఐర్లాండ్, కోల్ కతా తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో షూటింగ్ మొదలు కానుంది. 2020లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.