twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మదర్ థెరిస్సా’ జీవితంపై సినిమా రాబోతోంది, వివరాలు ఇవే..

    |

    అత్యంత ప్రతిష్టాత్మమైన నోబెల్ పురస్కారం అందుకుని భారతదేశానికే కీర్తి తెచ్చిన ప్రముఖుల్లో మదర్ థెరిసా ఒకరు. మానవాళిని దారిద్య్రం, బాధల నుంచి విముక్తి కల్పించటానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఈ బహుమతి దక్కింది. సేవాగుణంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన మదర్ థెరిస్సా జీవితంపై త్వరలో బాలీవుడ్ మూవీ రాబోతోంది.

    ఈ చిత్రానికి సీమా ఉపాధ్యాయ్ దర్శకత్వం వహించబోతున్నారు. ప్రదీప్ శర్మ, నితిన్ మన్మోహన్, గిరీష్ జోహార్, ప్రాచీ మన్మోహన్ నిర్మించబోయే ఈ బయోపిక్‌లో బాలీవుడ్, హాలీవుడ్ నుంచి ప్రముఖ స్టార్స్ నటించబోతున్నారు.

    ఆర్య, సాయేషా పెళ్లి సందడి.. సంగీత్‌లో అల్లు అర్జున్ కేక.. బుగ్గపై ముద్దుపెట్టి..!ఆర్య, సాయేషా పెళ్లి సందడి.. సంగీత్‌లో అల్లు అర్జున్ కేక.. బుగ్గపై ముద్దుపెట్టి..!

    Official biopic on Nobel laureate Mother Teresa launched

    ఓ ఆంగ్ల పత్రికతో డైరెక్టర్ సీమా ఉపాధ్యాయ్ మాట్లాడుతూ... ప్రజలను సేవా మార్గంలో నడిపించడంలో మదర్ థెరిస్సా ఎంత కృషి చేశారు. ఆమె ఈ ప్రపంచంలో ఎంతో మందికి స్పూర్తి. ఒక మామూలు మహిళ అంత పెద్ద సేవా సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారు అనే విషయాలను వెల్లడిస్తూ ఈ చిత్రం సాగుతుందని తెలిపారు.

    ఈ బయోపిక్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించబోతున్నాం. మదర్ థెరిసా జన్మించిన ఆల్బేనియా దేశంలోని 'స్కోయె' పట్టణంతో పాటు పారిస్, ఐర్లాండ్, కోల్ కతా తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో షూటింగ్ మొదలు కానుంది. 2020లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

    English summary
    Official biopic on nobel laureate Mother Teresa launched, produced by Pradeep Sharma, Nitin Manmohan, Girish Johar & Prachi Manmohan. Written-Directed by Seema Upadhyay. Cast-Crew comprises top talent pools of Bollywood & Hollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X