Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాధేశ్యామ్ అప్డేట్.. మరోసారి అభిమానులకు చిరాకు తెప్పిస్తున్న ప్రభాస్ టీమ్
ప్రభాస్ అభిమానులు మరోసారి రాధేశ్యామ్ విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్ల నుంచి సెట్స్ పై ఉన్న ఈ సినిమా షూటింగ్ సగం పూర్తయినట్లు చెబుతున్నప్పటికీ ఇంకా సరైన టీజర్ కూడా విడుదల చేయలేదు. సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ పుట్టినరోజు మరికొన్ని రోజుల్లో ఉండడంతో ఏదైనా స్పెషల్ సర్ ప్రైజ్ ఇస్తారేమో అని ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
రాధేశ్యామ్ టీమ్ మీద భారీ ఆశలతో..
అక్టోబర్ 23న ప్రభాస్ 41వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. గత కొన్ని వారాలుగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ అడ్వాన్స్ విషెస్ తో భారీ స్థాయిలో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇక పుట్టినరోజున తప్పకుండా ఏదైనా కిక్కిచ్చే టీజర్ వదులుతారేమోనని రాధేశ్యామ్ టీమ్ మీద భారీ స్థాయిలో నమ్మకం పెట్టుకున్నారు. కానీ గత ఏడాదే వాళ్ళు ఒక పోస్టర్ తో సరిపెట్టారు.
కేవలం మోషన్ పోస్టర్ మాత్రమే..
ఇక ఇప్పుడు పుట్టినరోజు సందర్భంగా ఒక మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేస్తామని అంటున్నారు. ఇక మరోసారి రాధేశ్యామ్ టీమ్ పై అభిమానుల కోపం కట్టలు తెచ్చుకుంటోంది. బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ అంటూ ఫస్ట్ మోషన్ పోస్టర్ అక్టోబర్ 23న రిలీజ్ చేస్తాము. తప్పకుండా రాధే శ్యామ్ ప్రేమలో మీరు కూడా పడిపోతారు అంటూ కొద్దీ సేపటి క్రితమే ఒక అప్డేట్ ఇచ్చారు. కానీ ఈ అప్డేట్ పై అభిమానులు ఏ మాత్రం సంతృప్తిగా లేరని సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తుంటేనే అర్ధమవుతోంది
ఇదివరకే ఒకసారి యూవీపై ఆగ్రహం
గత ఏడాది సాహో అనంతరం అభిమానులు యూవీ క్రియేషన్స్ ని బ్యాన్ చేయాలి అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యేలా హ్యాష్ ట్యాగ్ ని క్రియేట్ చేశారు. అప్పుడే ఆ టీమ్ అలెర్ట్ అయ్యిందని అంతా అనుకున్నారు. కానీ ఇంకా ఆ టీమ్ అదే తరహాలో అభిమానుల సహనాన్ని పరిక్షిస్తోంది. షూటింగ్ మొదలై ఎన్ని రోజులు అవుతోంది. ఇంతవరకు టీజర్ లేదని కామెంట్స్ చేస్తున్నారు.
Recommended Video
|
ఎంతవరకు మెప్పిస్తారో?
సాహో సినిమాతో మెప్పిస్తారు అనుకుంటే ఆ సినిమాను అంచనాలకు తగ్గట్లుగా రూపొందించలేకపోయారు. ఇక ఆ తరువాత సినిమా విషయంలో అయినా కొంచెం ఆలోచించి అభిమానులను మెప్పించాల్సిన యూవీ క్రియేషన్స్ ఇంకా ఆలస్యం చేస్తోందని ఓ వర్గం వారు కామెంట్స్ చేస్తున్నారు. కనీసం మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది కూడా చెప్పలేదు అంటే వీళ్ళ పని ఏ విధంగా ఉందొ అర్థం చేసుకోవచ్చని కూడా అంటున్నారు. మరి యూవీ క్రియేషన్స్ అభిమానులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.