Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నిజంగానే ‘సరిలేరు’ అనిపించేలా.. బుకింగ్స్లోనూ ట్రెండ్
మహేష్ బాబు సినిమా వస్తోందంటే.. కేవలం సూపర్ స్టార్ ఫ్యాన్స్లోనే కాదు సగటు సినీ అభిమానిలోనూ ఉత్కంఠ రేగుతుంది. క్లాస్ మాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే మహేష్ బాబు.. వరుస హిట్లతో బాక్సాఫీస్ పని పడుతున్నాడు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి వంటి బ్లాక్ బస్టర్లతో ఇప్పటికే రికార్డులను తన పేరు మీదే రాసుకున్న మహేష్.. మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు వస్తున్నాడు.
కేవలం ఐదు నెలల్లోనే..
ఎఫ్2 లాంటి భారీ హిట్ కొట్టిన మీడియం రేంజ్ దర్శకుడికి ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు చాన్స్ ఇవ్వడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మహేష్ బాబు సినిమాలంటే.. ఆలస్యమవుతాయని అందరూ అనుకుంటారు. కానీ ఈ చిత్రాన్ని కేవలం ఐదు నెలల్లోనే పూర్తి చేసి అందరికీ షాక్ ఇచ్చాడు దర్శకుడు.
ఎన్నో ప్రత్యేకతలతో..
సరిలేరు నీకెవ్వరు అని టైటిల్ పెట్టడం దగ్గరి నుంచి ఎన్నో ప్రత్యేకతలను జొప్పించిన ఈ చిత్ర యూనిట్.. సరిలేరును భారీ ఎత్తున నిర్మిచింది. విజయశాంతి, బండ్ల గణేష్ లాంటి వారిని ప్రత్యేక పాత్రల్లో తీసుకుని సినిమాపై హైప్ను పెంచేసింది. విజయశాంతిని ఈ చిత్రంలో నటించేలా ఒప్పించడం, ఆమె కోసమే ప్రత్యేకంగా ఓ పాత్రను రాసుకోవడం అందరికీ ఆసక్తిని రేకెత్తిచింది.
అంచనాలు పెంచేసిన టీజర్, ట్రైలర్..
అప్పటి వరకు పోస్టర్లతోనే హైప్ క్రియేట్ చేసిన సరిలేరు టీమ్.. టీజర్తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. టీజరే ఈ రేంజ్లో ఉంటే ట్రైలర్ ఇంకేస్థాయిలో ఉంటుందా? అని అందరూ అనుకున్నారు. అదే నిజం చేస్తూ విడుదల చేసిన ట్రైలర్.. సోషల్ మీడియాను షేక్ చేసింది. ట్రైలర్తో సరిలేరుపై పదింతలు అంచనాలు పెంచేసింది.
Recommended Video
రిలీజ్కు సిద్దం.. బుకింగ్స్లో ట్రెండ్
జనవరి
11న
ప్రపంచ
వ్యాప్తంగా
భారీ
ఎత్తున
రిలీజ్
చేస్తున్న
సరిలేరు
నీకెవ్వరు
చిత్రం..
బుకింగ్స్లో
కొత్త
ఒరవడిని
సృష్టిస్తోంది.
దాదాపు
తెలుగు
రాష్ట్రాల్లోని
అన్ని
థియేటర్లలో
సరిలేరు
చిత్రాన్ని
ప్రదర్శిస్తుండగా..
ఆన్లైన్లో
టిక్కెట్లు
ఓ
రేంజ్లో
తెగుతున్నాయని
తెలుస్తోంది.
ఈ
క్రమంలో
మహేష్కు
ఎక్కువ
పట్టున్న
నైజాంలో
ఓ
రేంజ్లో
బుకింగ్
జరుగుతుండగా..
ఆంద్ర,
సీడెడ్లో
అన్ని
స్క్రీన్స్
ఫుల్
అయినట్టు
తెలుస్తోంది.