Padma Awards 2024: మెగాస్టార్ చిరంజీవి, వెంకయ్య నాయుడికి పద్మ విభూషణ్.. ఇంకా పద్మ అవార్డులు ఎవరెవరికంటే?
దేశంలో పలు రంగాల్లో విశేష సేవలు అందించిన కళాకారులు, ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ జాబితాలో ఎవరెవరూ ఉన్నారంటే..
పద్మ విభూషణ్
సినిమా రంగానికి సేవలు అందించిన తెలంగాణకు చెందిన మెగాస్టార్ చిరంజీవి
సినిమా రంగానికి విశేష సేవలు చేసిన తమిళనాడుకు చెందిన సినీ నటి వైజయంతీ మాల
రాజకీయ రంగంలో రాణించిన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
కళారంగానికి సేవలందిచంిన తమిళనాడుకు చెందిన పద్మ సుబ్రమణ్యంకు పద్మవిభూషణ్ అవార్డులను అందించారు.

పద్మభూషణ్
ఉషా ఉతప్ (సినీ రంగం)
విజయ్ కాంత్ సినీ రంగం, మరణాంతరం)
మిథున్ చక్రవర్తి (సినీ రంగం)
కేరళకు చెందిన ఫాతిమా బీవీ (ప్రజాసేవ)
శ్రీ హోర్మాస్జీ కామా (విద్య రంగం)
యంగ్ లీ (వ్యాపార రంగం)
సీతారాం జిందాల (వ్యాపార రంగం)
అశ్విన్ బాలాచంద్ మెహతా
రామ్ నాయక్
దత్తాత్రేయ అంబదాస్
తోగ్డన్ రింపోచే
పద్మశ్రీ అవార్డులు
ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి, నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి దాసరి కొండప్పకు పద్మశ్రీ, బుర్ర వీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప,
తెలంగాణకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











