Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
విశాల్ ‘పందెం కోడి-2’ బిజినెస్ అదుర్స్, దసరా బరిలో!
హీరో విశాల్కు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడటానికి కారణం 2005లో వచ్చిన 'పందెం కోడి' మూవీ. లింగు స్వామి దర్శకత్వం వహించిన ఈచిత్రం తమిళంతో పాటు తెలుగులో సంచలన విజయం సాధించింది. దాదాపు 13 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ 'పందెం కోడి-2' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 19తో ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. దాసరా సందర్భంగా అక్టోబర్ 18న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విశాల్ తన సొంత బేనర్లో నిర్మిస్తున్నఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్. రాజ్ కిరణ్ ముఖ్యమైన పాత్రలో నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ నెగెటివ్ రోల్ పోషిస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు రైట్స్ ఠాగూర్ మధు సొంతం చేసుకున్నాడు. విశాల్ గత చిత్ర అభిమన్యుడు మంచి విజయం సాధించడం, పందెం కోడి సీక్వెల్ కావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరుగుతోంది.
ఆంధ్ర ఏరియా రైట్స్ రూ. 6 కోట్ల రేషియోలో అమ్మినట్లు సమాచారం. యూవి వంశీ గుంటూరు ఏరియా రైట్స్ దక్కించుకున్నారు. నైజాం ఏరియాలో సొంతగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సీడెడ్ ఏరియా రైట్స్ ఇంకా అమ్మడు కాలేదని టాక్.
త్వరలో సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలో తమిళంలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. తెలుగులో టీజర్ రిలీజ్ చేయడం ద్వారా ప్రమోషన్స్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.