Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పరుశురాం డైరెక్ట్ చేయబోయే ఆ టాప్ స్టార్ అతడేనా!
దర్శకుడు పరుశురాం పేరు ఇప్పుడు టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. గీత గోవిందం చిత్రంతో పరుశురాం తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నాడు. గీత గోవిందం చిత్రం ఆ స్థాయిలో వసూళ్లు రాబడుతుందని పరుశురాం కూడా ఊహించి ఉండలేదేమో. ప్రస్తుతం పరుశురాంతో సినిమా చేయడానికి చాలా మంది స్టార్ హీరోలు ఆసక్తి చూపుతున్నారు. పరుశురాం తదుపరి చిత్రం కూడా గీత ఆర్ట్స్ బ్యానర్ లోనే ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా పరుశురాం నిన్ననే తన తదుపరి చిత్రం టాలీవుడ్ స్టార్ హీరోతో ఉండబోతోందని ఖరారు చేశారు. కానీ హీరో పేరు మాత్రం ప్రకటించలేదు. దీనితో పరుశురాంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆ హీరో ఎవరు అంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పరుశురాం తదుపరి చిత్రం ఉండబోతోందని జోరుగా చర్చ జరుగుతోంది.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభమైపోయినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. నా పేరు సూర్య చిత్రం తరువాత బన్నీ బాగా గ్యాప్ తీసుకుంటున్నాడు. సరైన కథ కోసం అన్వేషిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా బన్నీ మరో చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ బన్నీ ఇంతవరకు దేనిని అధికారికంగా ప్రకటించలేదు.