Don't Miss!
- News నామినేషన్ల పర్వంలో టీడీపీకి ఊహించని షాక్
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇండియన్ ఛానల్స్ ఇలా చేయాలి.. పుల్వామా ఘటనపై పరేష్ రావల్ ఆగ్రహం!
పాక్ ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా ప్రాంతంలో జరిగిపిన ఆత్మాహుతి దాడిలో 49మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.యావత్ దేశాన్ని విషాదాన్ని గురి చేసిన ఈ ఘటనపై సెలెబ్రిటీలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో చెలరేగిన నిరసన జ్వాలలు ఇంకా దేశం నలుమూలల కొనసాగుతున్నాయి. తాజాగా ప్రముఖ నటుడు పరేష్ రావల్ పుల్వామా ఘటన గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారతీయ ఛానల్స్ ఇకపై పాకిస్తానీ ప్రముఖుల్ని పిలిచి షోలు చేయడం ఆపేయాలని అన్నారు. కనీసం ఇంటర్వ్యూలు కూడా చేయకూడదని కోరారు. జాతీయ ఛానల్స్ ఒక్క తాటిపైకి వచ్చి పాకిస్థానీ ప్రముఖులపై బ్యాన్ విధించాలని కోరారు. ఇప్పటికే పాకిస్థాన్ తారలపై బాలీవుడ్ నిషేధం విధించింది. అని కోణాల్లో పాకిస్తాన్ ప్రమేయం లేకుండా పూర్తిగా నిషేదించాలని పరేష్ రావల్ అన్నారు.
An Humble appeal to our national news channels. Plz don’t invite any Pakistani or Indian terrorist sympathisers to spew venom against our dear motherland . Those rabid dogs are not allowed in our homes . Let those maggots die in their own filth .
— Paresh Rawal (@SirPareshRawal) February 17, 2019
2016లో జరిగిన ఉగ్రదాడి, దానికి ప్రతీకారంగా జరిపిన సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో యురి చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం 200 కోట్ల వసూళ్లతో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సర్జికల్స్ స్ట్రైక్స్ ప్లానింగ్ లో కీలక పాత్ర పోషించిన జాతీయ రక్షణ అధికారి అజిత్ దోవల్ పాత్రలో పరేష్ రావల్ నటించి మెప్పించారు.