ఇండియన్ ఛానల్స్ ఇలా చేయాలి.. పుల్వామా ఘటనపై పరేష్ రావల్ ఆగ్రహం!
పాక్ ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా ప్రాంతంలో జరిగిపిన ఆత్మాహుతి దాడిలో 49మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.యావత్ దేశాన్ని విషాదాన్ని గురి చేసిన ఈ ఘటనపై సెలెబ్రిటీలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో చెలరేగిన నిరసన జ్వాలలు ఇంకా దేశం నలుమూలల కొనసాగుతున్నాయి. తాజాగా ప్రముఖ నటుడు పరేష్ రావల్ పుల్వామా ఘటన గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారతీయ ఛానల్స్ ఇకపై పాకిస్తానీ ప్రముఖుల్ని పిలిచి షోలు చేయడం ఆపేయాలని అన్నారు. కనీసం ఇంటర్వ్యూలు కూడా చేయకూడదని కోరారు. జాతీయ ఛానల్స్ ఒక్క తాటిపైకి వచ్చి పాకిస్థానీ ప్రముఖులపై బ్యాన్ విధించాలని కోరారు. ఇప్పటికే పాకిస్థాన్ తారలపై బాలీవుడ్ నిషేధం విధించింది. అని కోణాల్లో పాకిస్తాన్ ప్రమేయం లేకుండా పూర్తిగా నిషేదించాలని పరేష్ రావల్ అన్నారు.

2016లో జరిగిన ఉగ్రదాడి, దానికి ప్రతీకారంగా జరిపిన సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో యురి చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం 200 కోట్ల వసూళ్లతో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సర్జికల్స్ స్ట్రైక్స్ ప్లానింగ్ లో కీలక పాత్ర పోషించిన జాతీయ రక్షణ అధికారి అజిత్ దోవల్ పాత్రలో పరేష్ రావల్ నటించి మెప్పించారు.


Click it and Unblock the Notifications











