Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్: చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుక భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 22న ఆయన 64వ వడిలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అభిమానులు పుట్టినరోజు వేడుక గ్రాండ్గా సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేశారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సారి మెగాస్టార్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ హైదరాబాద్లోని శిల్పకళా వేదకలో ఆగస్టు 21న సాయంత్రం ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఈ పుట్టినరోజు వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ స్టార్స్ అందరూ పాల్గొని అభిమానులకు కనువిందు చేయబోతున్నారట.
త్వరలో చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' మూవీ విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సారి పుట్టినరోజు వేడుక మరింత గ్రాండ్గా నిర్వహించబోతున్నారు. వైభవంగా జరుగబోతున్న ఈ ఈవెంటులో సైరా మేకింగ్ వీడియో, టీజర్ కూడా ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది.
చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మించిన చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని దాదాపు రూ. 200 కోట్ల పై చిలుకు బడ్జెట్తో తెరకెక్కించారు. అక్టోబర్ 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.