Don't Miss!
- Automobiles ప్రతి 14 నిమిషాలకు ఓ కారు మాయం.. అత్యధికంగా కార్లు చోరీ అయ్యేది ఈ నగరాల్లోనే.!!
- Technology Lava నుంచి కొత్త స్మార్ట్ ఫోన్! మార్చి 22 న లాంచ్,టీజర్ విడుదలైంది
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
- News ఆపరేషన్ పిఠాపురం ! పవన్ ఓటమికి జగన్ బిగ్ ప్లాన్ ఇదే..!
- Sports Shreyanka Patil: ఆటతోనే కాదు..అందంతోనూ క్లీన్ బౌల్డే!
- Lifestyle Chapathi Kurma: చిటికెలో రుచికరంగా చపాతీ కుర్మా రిసిపి రెడీ.
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్: చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుక భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 22న ఆయన 64వ వడిలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అభిమానులు పుట్టినరోజు వేడుక గ్రాండ్గా సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేశారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సారి మెగాస్టార్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ హైదరాబాద్లోని శిల్పకళా వేదకలో ఆగస్టు 21న సాయంత్రం ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఈ పుట్టినరోజు వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ స్టార్స్ అందరూ పాల్గొని అభిమానులకు కనువిందు చేయబోతున్నారట.
త్వరలో చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' మూవీ విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సారి పుట్టినరోజు వేడుక మరింత గ్రాండ్గా నిర్వహించబోతున్నారు. వైభవంగా జరుగబోతున్న ఈ ఈవెంటులో సైరా మేకింగ్ వీడియో, టీజర్ కూడా ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది.
చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మించిన చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని దాదాపు రూ. 200 కోట్ల పై చిలుకు బడ్జెట్తో తెరకెక్కించారు. అక్టోబర్ 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.