Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్: చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుక భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 22న ఆయన 64వ వడిలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అభిమానులు పుట్టినరోజు వేడుక గ్రాండ్గా సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేశారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సారి మెగాస్టార్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ హైదరాబాద్లోని శిల్పకళా వేదకలో ఆగస్టు 21న సాయంత్రం ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఈ పుట్టినరోజు వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ స్టార్స్ అందరూ పాల్గొని అభిమానులకు కనువిందు చేయబోతున్నారట.
త్వరలో చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' మూవీ విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సారి పుట్టినరోజు వేడుక మరింత గ్రాండ్గా నిర్వహించబోతున్నారు. వైభవంగా జరుగబోతున్న ఈ ఈవెంటులో సైరా మేకింగ్ వీడియో, టీజర్ కూడా ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది.
చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మించిన చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని దాదాపు రూ. 200 కోట్ల పై చిలుకు బడ్జెట్తో తెరకెక్కించారు. అక్టోబర్ 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.