Don't Miss!
- News కావ్య మారన్ ఆస్తులు ఎంతో తెలుసా - ఒక్కరే వారసురాలు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పరుచూరి వెంకటేశ్వరరావుకు సతీ వియోగం.. పవన్ కల్యాణ్ పరామర్శ
ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు సతీమణి శ్రీమతి విజయలక్ష్మి కన్నుమూయడంతో సినీ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. ఆయనకు పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ 19 పరిస్థితుల కారణంగా స్వయంగా ఓదార్చలేకపోయిన సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా, ప్రకటన ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు సతీమణి మరణవార్తను తెలియగానే మెగా ఫ్యామిలీ తమ సంతాపం ప్రకటించి ఫోన్లో ఓదార్చారు. తాజాగా పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతాప ప్రకటనను విడుదల చేశారు.
తన సంతాప ప్రకటనలో పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు గారి సతీమణి శ్రీమతి విజయలక్ష్మి గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. శ్రీమతి విజయలక్ష్మి గారు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. పరుచూరి సోదరుల కుటుంబాలతో మా కుటుంబానికి మంచి స్నేహం ఉంది. ఈ కష్ట సమయంలో శ్రీ వెంకటేశ్వర రావు గారికి, వారి కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.
గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయలక్ష్మి శుక్రవారం గుండెపోటుతో మరణించారు. ఆమె వయసు 74 సంవత్సరాలు. హైదరాబాద్లోని స్వగృహంలో ఆమె మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. విజయలక్ష్మీ ఆత్మకు శాంతి చేకూరాలి. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని పలువురు సన్నిహితులు, స్నేహితులు, సినీ ప్రముఖులు భగవతుండిని ప్రార్థిస్తున్నారు.