Don't Miss!
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
కేంద్రీయ సైనిక్ బోర్డుకు పవన్ కళ్యాణ్ విరాళం.. ఆర్మ్డ్ ఫోర్స్ బ్యాడ్జితో గౌరవించిన అధికారులు
భారతదేశ రక్షణ కొరకు విధి నిర్వహణలో చనిపోయిన సైనికుల కుటుంబాలను కేంద్రీయ సైనిక్ బోర్డు ఆదుకుంటుందన్న విషయం తెలిసిందే. త్రివిధ దళాలలో పనిచేసే ప్రతి ఒక్క సైనికుడి కుటుంబానికి కేంద్రీయ సైనికి బోర్డు అండగా నిలబడుతుంది. ఇందుకొరకు కావాల్సిన నిధులను ప్రజల వద్ద నుండి విరాళాల రూపంలో సేకరిస్తుంది. అలాంటి సైనిక్ బోర్డ్కు పవన్ కళ్యాణ్ భారీ మొత్తం విరాళాన్ని అందజేశాడు.
సాయుధ దళాల పతాక దినోత్సవ సందర్భంగా..
ప్రతి సంవత్సరం డిసెంబర్ 7న సాయుధ దళాల పతాక దినోత్సవంగా జరుపుకుంటాము. మన దేశం కోసం సాయుధ దళాల సైనికులు చేస్తున్న కృషిని ఆరోజున మనం మరొకసారి గుర్తుచేసుకుంటాం. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి దేశభక్తిని చాటుకున్నాడు.
చెక్కును అందజేసిన పవన్..
డిసెంబర్ 7న చెప్పినట్లుగానే ఈరోజు (ఫిబ్రవరి 20) సైనిక్ బోర్డును సందర్శించి నిర్వాహుకులకు పవన్ కళ్యాణ్ కోటి రూపాయల చెక్కును అందజేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్క భారతీయుడు సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చాడు.
ఆర్మ్డ్ ఫోర్స్ బ్యాడ్జితో..
దేశంపై ఉన్న ప్రేమను, దేశాన్ని కాపాడే సైనికుల పట్ల ఉన్న ప్రేమను వారిని ఆదుకోవడానికి చేతనైన సహాయాన్ని చేసిన పవన్ కళ్యాణ్ను సైనిక అధికారులు గౌరవించారు. ఆర్మ్డ్ ఫోర్స్ బ్యాడ్జితో అక్కడి అధికారులు పవన్ను గౌరవించారు.
Recommended Video
వరుస ప్రాజెక్ట్లతో బిజీ..
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నాడు. దిల్ రాజు నిర్మాణంలోని పింక్ రీమేక్, ఏఎమ్ రత్నం బ్యానర్పై క్రిష్తో ఓ సినిమాను, మైత్రీ సంస్థతో హరీష్ శంకర్ చేసే ప్రాజెక్ట్తో పవన్ కళ్యాణ్ బిజిబిజీగా ఉన్నాడు. వీటిలో పింక్ రీమేక్ శర వేగంగా షూటింగ్ను పూర్తి చేసుకుంటోంది.