Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కోటి రూపాయల విరాళం.. అది నాకు గర్వకారణం.. పవన్ కళ్యాణ్పై ప్రశంసలు
పవన్ కళ్యాణ్కు దేశ భక్తి ఉందన్న సంగతి ఎన్నోసార్లు నిరూపితమవుతూనే ఉంటుంది. ఆయన చేతల్లో, మాటల్లో అది నిత్యం ప్రస్ఫుటమవుతుంది. ప్రసంగం చివర్లో జై హింద్ అనడం, అతని సినిమాల్లో దేశ భక్తి, సమాజానికి సంబంధించిన పాటలను పెట్టి కొందర్నీ అయినా చైతన్య పరచాలని చూస్తుంటారు. తాజాగా మరోసారి ఆయనకు దేశం మీదున్న ప్రేమను చాటి చెప్పాడు.
సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా
డిసెంబరు 7న సాయుధ దళాల పతాకదినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ సైనికుల పట్ల తన ప్రేమను మరోసారి ఘనంగా చాటుకున్నారు. అమరులైన సైనిక వీరుల కుటుంబాల సంక్షేమానికి ఉద్దేశించిన కేంద్రీయ సైనిక్ బోర్డుకు తనవంతు ఉడతా భక్తిగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించాడు.
గతంలో కూడా..
సైనికుల పట్ల శ్రీ పవన్ కల్యాణ్ గారికి ఈ గౌరవాభిమానాలు తొలి నుంచి ఉన్నవే. గతంలో తమ్ముడు చిత్రం చేస్తున్నప్పుడు కూడా కార్గిల్ లో పోరాడుతున్న వీరుల కోసం లక్ష రూపాయల విరాళం అందించాడు. అప్పట్లో తమ్ముడు ఆడియో ఫంక్షన్ సందర్భంగా.. తన తండ్రి కె.వెంకటరావు చేతుల మీదుగా.. అప్పటి వైమానికదళ మాజీ ప్రధానాధికారి శ్రీ ఐహెచ్ లతీఫ్కు అందజేశాడు.
తాజాగా మరోసారి..
తాజాగా మరోమారు కోటి రూపాయల విరాళాన్ని అందించి ప్రేమను చాటుకున్నాడు. డిసెంబరు 7న సైనిక పతాక దినోత్సవం సందర్భంగా.. సైనిక బోర్డు కార్యదర్శి బ్రిగేడియర్ మృగేంద్రకుమార్ పవన్ కల్యాణ్కు ఓ లేఖ రాస్తూ పతాకదినోత్సవం గురించి ఓ వీడియో సందేశం పంపాల్సిందిగా కోరారు. సైనికులు మన కోసం, మన దేశం కోసం ప్రాణ త్యాగం చేస్తున్నారని, పతాక దినోత్సవం సందర్భంగా మన వంతుగా మనం కూడా వారి కోసం కొంత చేయాలని ఆ వీడియో సందేశంలో పవన్ కల్యాణ్ దేశ ప్రజలకు పిలుపు ఇచ్చాడు. వీడియో సందేశంతో పాటు కోటిరూపాయల విరాళం కూడా ప్రకటించాడు.
Recommended Video
అమరవీరులైన సైనిక కుటుంబాలకు..
మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారు పిలుపు ఇచ్చినట్లుగా మనమందరం కూడా అమరవీరులైన సైనిక కుటుంబాలకు సంఘీభావంగా.. ఉదారంగా స్పందించి కేంద్రీయ సైనిక్ బోర్డుకు విరాళాలు ఇచ్చి, అండగా నిలవాలంటూ పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా చెప్పాడు. తమ కుటుంబంలో అమ్మ తరఫు తాతయ్య, తన పెదనాన్న ఇద్దరూ కూడా సైన్యంలో సేవలందించిన వారే కావడం తనకు గర్వకారణమని కూడా తెలిపాడు. సైనిక పతాక దినోత్సవం సందర్భంగా కోటి రూపాయల విరాళం ప్రకటించి పవన్ కల్యాణ్ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచాడు.