జగన్, వైసీపీ నాకు శత్రువు కాదు.. జీవితమంతా దెబ్బలే.. పవన్ కల్యాణ్ ఎమోషనల్
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత పవన్ కల్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. మంగళగిరిలో ఆయన తన అభిమానులు, కార్యకర్తలతో మాట్లాడుతూ.. ఆకాశమంతా విజయాన్ని అందించారు. పిఠాపురంలో నన్ను గెలిపించలేదు. 5 కోట్ల మంది ప్రజలను గెలిపించారు అని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ..
ఏపీలో చీకటి రోజులు ముగిశాయి. జనసేన 100 శాతానికి 100 శాతం విజయం సాధించింది. ధర్మం కోసం నిలబడ్డాం. ధర్మం మనకు నిలబెడింది. ఏపీ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొట్టాం. ప్రజలు మార్పు కోరుకొంటున్నారు. ప్రజలు భారీ బాధ్యతను పెట్టారు. వారి కోసం బాధ్యతగా వ్యవహరిస్తాం అని ఆయన అన్నారు.

ప్రజలు చారిత్రాత్మక విజయాన్ని అందించారు. గెలుపు నాకు బాధ్యతను ఇచ్చింది.. కానీ అహంకారాన్ని ఇవ్వదు. ఇది కక్ష సాధింపు చర్యలకు సమయం కాదు. నాకు జగన్, వైసీపీ నాకు శత్రువు కాదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండేలా చర్యలు తీసుకొంటాం. డీఎస్సీ సజావుగా వేసే బాధ్యతను తీసుకొంటాం అని పవన్ కల్యాణ్ అన్నారు.


Click it and Unblock the Notifications











