పవన్ కల్యాణ్కు తీవ్ర అస్వస్థత.. హాస్పిటల్కు తరలింపు
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో కళ్లు తిరిగిపడిపోవడంతో ఆయనను స్థానిక ఆయుష్ హాస్పిటల్కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దాంతో పవన్ కల్యాణ్ తన గుంటూరు పర్యటనను వాయిదా వేసుకొన్నారు.
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎండలు మండుతుండటం, అలసట, ఒత్తిడి కారణంగా పవన్ అస్వస్థతకు గురైనట్టు వైద్యులు వెల్లడించారు.

గత రాత్రి హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బీఎస్పీ అధినేత మాయవతితో కలిసి పవన్ భారీ బహిరంగసభలో పాల్గొన్నారు. అనంతరం ఏపీలో ఎన్నికల ప్రచారానికి విజయవాడకు తరలివెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన కళ్లు తిరిగి పడిపోవడంతో హాస్పిటల్కు తరలించారు.


Click it and Unblock the Notifications











