Don't Miss!
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
ధర్మాన్ని పరిరక్షిద్దాం–మతసామరస్యాన్ని కాపాడుకుందాం.. దీపాలు వెలిగించిన పవన్ కళ్యాణ్
దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకొనేందుకు నేడు పవన్ కళ్యాణ్ దీపారాధాన కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో జరిగిన అగ్నిప్రమాదంపై అందరూ భగ్గుమన్నారు. ఆ ప్రమాదంలో 62 ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి రథం అగ్నికి ఆహుతవడం కలకలం రేపింది.
దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సనాతనధర్మాన్ని పరిరక్షించుకొనేందుకు దీపాలు వెలిగించే కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చాడు. 1893,11 సెప్టెంబర్...స్వామి వివేకానంద వారు చికాగోలోని ప్రపంచ మత సమ్మేళనంలో- మన ధర్మం ఎంత విశాల దృక్పథం కలిగినదో ప్రపంచానికి చాటిన రోజు. ఇదే రోజు మనం 'ధర్మాన్ని పరిరక్షిద్దాం - మతసామరస్యాన్ని కాపాడుకుందాం' అనే చిత్తంతో దీపాలు వెలిగిస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నాడు.
ఇక పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుకు జనసేన కార్యకర్తలు, అభిమానులు కదిలారు. తమ తమ ఇంట్లోనే దీపాలు వెలిగించి మహత్తర కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. మెగా ఇంట్లో సురేఖ దీపాలు వెలిగించగా.. వాటిని రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ తన ఫాంహౌస్లోనే దీపాలు వెలిగించి ధర్మాన్ని పరిరక్షిద్దాం-మతసామరస్యాన్ని కాపాడుకుందాం అని సంకల్పం చెప్పుకొంటూ ధ్యానం చేశాడు.