Don't Miss!
- Sports PBKS vs MI: తొండాటకు ముగింపు.. కెమెరా ముందు టాస్ కాయిన్ ఫలితం! వీడియో
- News నెల్లూరు జైలుకు జగన్ పై దాడి కేసు నిందితుడు సతీష్-14 రోజుల రిమాండ్..!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ప్రధాని మాట పాటిద్దాం.. పవన్ కళ్యాణ్ సందేశం వైరల్
కరోనాను కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూ అనే కాన్సెప్ట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆదివారం (మార్చి 22) ప్రజలెవరూ బయటకు రాకుండా ఎవరికి వారు స్వీయ నిర్భందాన్ని విధించుకోవడమే జనతా కర్ఫ్యూ. ఇప్పటికే ఈ కాన్సెప్ట్పై విస్తృత ప్రచారాన్ని కల్పిస్తున్నారు. అందరికీ ఈ విధానం గురించి వివరించడని, ఆ రోజు ఎవ్వరూ కూడా బయటకు వెళ్లొద్దని, తెలిసిన వారందరికీ చెప్పండని ప్రధాని సూచించారు.
ఈ మేరకు జనతా కర్ఫ్యూ గురించి బాలీవుడ్ ప్రముఖులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అక్షయ్ కుమార్, అమితాబ్, షాహిద్ కపూర్ వంటి హీరోలు వీడియో సందేశం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సైతం ముందడుగు వేశాడు. ప్రధాని నిర్ణయానికి తన మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించి సందేశాన్ని పంపాడు.
ప్రధాని మాట పాటిద్దాం-కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం అంటూ స్లోగన్ను ప్రచారం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ప్రధాని చెప్పినట్టుగా ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు ఎవ్వరూ బయటకు రాకూడదని సూచించాడు. ఇలా చేస్తే కరోనా మహమ్మారిని కట్టడి చేసే అవకాశముందని తెలిపాడు. కాబట్టి ప్రజలంతా ప్రధాని సూచనలను పాటించాలని పిలుపునిచ్చాడు.