వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు.. పవన్‌ కళ్యాణ్‌ పిక్స్ వైరల్

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు సినిమాలతో ఇటు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మొన్ననే నిహారిక పెళ్లి కోసం ఉదయ్ పూర్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చాడో లేదో మళ్లీ ఓ పర్యటన చేశాడు. కృష్ణాజిల్లా డోకిపర్రు వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు. ఈ మేరకు అక్కడి ప్రజలతో మాట్లాడిన సందర్భంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కృష్ణా జిల్లా డోకిపర్రు మేఘా కృష్ణారెడ్డి స్వగ్రామం. మేఘా కృష్ణారెడ్డి సంస్థ అంచెలంచెలుగా ఎదిగి ఆర్థికంగా స్థిరపడ్డాక తన స్వగ్రామం డోకిపర్రును ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చేశారు. రోడ్లు, మంచినీటి వసతి, గ్యాస్‌ సరఫరా తదితర అనేక సౌకర్యాలు ఆ గ్రామానికి కల్పించారు. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆ ఊరిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పుడు ఆ గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆ ఉత్సవాల నిర్వహణకోసం మేఘా కృష్ణారెడ్డి కుటుంబం ప్రస్తుతం అక్కడే ఉంటూ... ఆ కార్యక్రమ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తోంది. ఇది ఏటా జరిగేదే. అయితే ఈ ఏడాది ప్రత్యేకత ఏమిటంటే పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనటం.

Pawan kalyan Visits Dokiparru Temple

కృష్ణాజిల్లా డోకిపర్రు వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఈరోజు విచ్చేసిన పవన్‌ కళ్యాణ్‌ కు మేఘా కృష్ణారెడ్డి కుటుంబం స్వాగతం పలికింది. ప్రతి ఏటా మేఘా కృష్ణారెడ్డి కుటుంబం తన గ్రామంలో తాము నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఈరోజు పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ రావడంతో ఆ ప్రాంత పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X