Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పవన్ కల్యాణ్ వీరాభిమాని దర్శకత్వంలో పవనిజం2
ఆర్ కె స్టూడియోస్ పతాకంపై గుంటూరు టాకీస్ లాంటి సూపర్ హిట్ సినిమా అందించిన నిర్మాత రాజశ్రీ తాజాగా పవనిజం2 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మధుబాబు, పావని హీరో, హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ వీరాభిమాని కృష్ణ చైతన్య దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. సమాజంలో ఎవరికీ సరైన బాధ్యత ఉండట్లేదు. అలాంటిది ఒక పవన్ కళ్యాణ్ అభిమాని తన ప్రేరణతో సొసైటీని మార్చే భాద్యత భుజానికి ఎత్తుకోవడం, ఆ తర్వాా రాజకీయాల్లో ఎలాంటి మార్పుని తీసుకొచ్చాడనేదే ఈ చిత్రం కథాశమని చిత్ర యూనిట్ తెలిపింది.
అయితే సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం పవనిజం2 కు సంబంధించిన మొదటి మోషన్ పోస్టర్ ను అగ్ర దర్శకుడు వి వి వినాయక్ చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా... వీవీ వినాయక్ మాట్లాడుతూ "ముందుగా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయన మీద అభిమానం తో అయన ఉదేశాలని అయన సిద్ధాంతాలని ముందుకు తీసుకువెళ్లాలని పవనిజం 2 సినిమా తీశారు. ఈ సినిమా పెద్ద విజయం సాదించాలని, పవన్ కళ్యాణ్కు నచ్చే సినిమా కావాలని కోరుకుంటున్నాను. దర్శకుడు కృష్ణ చైతన్యకి మంచి పేరు రావాలని నిర్మాత రాజశ్రీకి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.
నిర్మాత రాజశ్రీ మాట్లాడుతూ " వినాయక్ మా సినిమా మోషన్ పోస్టర్ను విడుదల చేయటం చాలా సంతోషం. సినిమా చాలా బాగా వచ్చింది. దర్శకుడు కృష్ణ చైతన్య సినిమాని బాగా చిత్రీకరించారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. అని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ లో విడుదల చేస్తాము" అని తెలిపారు.
ఈ చిత్రానికి మ్యూజిక్: సాయి కార్తీక్, ఎడిటింగ్ : ఎస్ శేఖర్, కెమెరా : రామ్ పి రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు మరియు దర్శకత్వం : కృష్ణ చైతన్య, నిర్మాత : రాజశ్రీ.