Don't Miss!
- Finance Gold Rate: రంకెలు వేస్తున్న బంగారం ధరలు.. నేడు రూ.3,800 పెరగటంతో..
- Technology గూగుల్ Pixel 9 డిజైన్ లీక్ అయింది! స్పెసిఫికేషన్లు, లాంచ్ వివరాలు
- News బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్దులు ఖరారు అయింది అక్కడేనా...!?
- Automobiles బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- Sports Hardik Pandya: కెప్టెన్గా చెత్త రికార్డు సాధించా.. హ్యాపీనే!
- Lifestyle ఈ అలవాట్లు ఉన్నవారికి తీవ్ర కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది...వెంటనే బయటపడండి...!
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
పవన్ కల్యాణ్ వీరాభిమాని దర్శకత్వంలో పవనిజం2
ఆర్ కె స్టూడియోస్ పతాకంపై గుంటూరు టాకీస్ లాంటి సూపర్ హిట్ సినిమా అందించిన నిర్మాత రాజశ్రీ తాజాగా పవనిజం2 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మధుబాబు, పావని హీరో, హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ వీరాభిమాని కృష్ణ చైతన్య దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. సమాజంలో ఎవరికీ సరైన బాధ్యత ఉండట్లేదు. అలాంటిది ఒక పవన్ కళ్యాణ్ అభిమాని తన ప్రేరణతో సొసైటీని మార్చే భాద్యత భుజానికి ఎత్తుకోవడం, ఆ తర్వాా రాజకీయాల్లో ఎలాంటి మార్పుని తీసుకొచ్చాడనేదే ఈ చిత్రం కథాశమని చిత్ర యూనిట్ తెలిపింది.
అయితే సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం పవనిజం2 కు సంబంధించిన మొదటి మోషన్ పోస్టర్ ను అగ్ర దర్శకుడు వి వి వినాయక్ చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా... వీవీ వినాయక్ మాట్లాడుతూ "ముందుగా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయన మీద అభిమానం తో అయన ఉదేశాలని అయన సిద్ధాంతాలని ముందుకు తీసుకువెళ్లాలని పవనిజం 2 సినిమా తీశారు. ఈ సినిమా పెద్ద విజయం సాదించాలని, పవన్ కళ్యాణ్కు నచ్చే సినిమా కావాలని కోరుకుంటున్నాను. దర్శకుడు కృష్ణ చైతన్యకి మంచి పేరు రావాలని నిర్మాత రాజశ్రీకి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.
నిర్మాత రాజశ్రీ మాట్లాడుతూ " వినాయక్ మా సినిమా మోషన్ పోస్టర్ను విడుదల చేయటం చాలా సంతోషం. సినిమా చాలా బాగా వచ్చింది. దర్శకుడు కృష్ణ చైతన్య సినిమాని బాగా చిత్రీకరించారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. అని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ లో విడుదల చేస్తాము" అని తెలిపారు.
ఈ చిత్రానికి మ్యూజిక్: సాయి కార్తీక్, ఎడిటింగ్ : ఎస్ శేఖర్, కెమెరా : రామ్ పి రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు మరియు దర్శకత్వం : కృష్ణ చైతన్య, నిర్మాత : రాజశ్రీ.