Don't Miss!
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Finance Amit Shah: ఆ కంపెనీల్లో అమిత్ షా పెట్టుబడులు.. హోం మంత్రి పోర్ట్ఫోలియోలో టాప్-10 స్టాక్స్ ఇవే
- News కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకపోతే..: జగన్ నోటి వెంట జాతీయ రాజకీయాలు
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Sports SRH ఎఫెక్ట్తో IPLలో కొత్త రూల్: బౌలర్లకు గుడ్ & బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్!
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
అనురాగ్ కశ్యప్పై పాయల్ ఘోష్ కేసు నమోదు.. వెర్సోవా పోలీస్ స్టేషన్కు వెళ్లి..
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్పై హీరోయిన్ పాయల్ ఘోష్ రాతపూర్వకమైన ఫిర్యాదు చేసింది. ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్లో తన ఫిర్యాదును దాఖలు చేశారు. మంగళవారం సాయంత్రం అనురాగ్ కశ్యప్పై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన సమయంలో ఆమె తన లాయర్ నితిన్ సత్పుతే ఉన్నారు.
పాయల్ ఘోష్ ఫిర్యాదు చేసిన తర్వాత లాయర్ స్పందిస్తూ.. రేప్, అసభ్య ప్రవర్తన, లైంగిక దాడి, శారీరక హింస లాంటి ఆరోపణలపై ఫిర్యాదు చేశాం. ఐపీసీ సెక్షన్ 376, 354, 341, 342 ప్రకారం కేసు పెట్టాం అని ఓ ప్రకటనను రిలీజ్ చేశారు.
వాస్తవానికి పాయల్ ఘోష్ సోమవారమే ఓషివారా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సింది. అయితే మహిళా కానిస్టేబుల్ అందుబాటులో లేకపోవడం వల్ల ఆమె తన ఫిర్యాదును పోలీసులకు అందజేయలేకపోయారు అని తెలిపారు.
అనురాగ్ కశ్యప్పై గత కొద్దికాలంగా ఫిర్యాదు చేయాలని అనుకొంటున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల నేను బయట పెట్టలేకపోయాను. ఈ మధ్యనే ధైర్యాన్ని కూడగట్టుకొని బయటపెట్టాను అని మీడియాతో అన్నారు.
ఇదిలా ఉండగా, పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలను దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఖండించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.