twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Kathi Mahesh Case : మహేష్ కారు అందుకే నడిపా.. అక్కకి వెంటనే చెప్పా?

    |

    సినీ విమర్శకుడు కత్తి మహేష్ నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం గురై తర్వాత చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే.. అయితే రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు కొంత మంది ప్రమాదం మీద అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన మృతి మీద అనుమానాలు వ్యక్తం అవుతున్న క్రమంలో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే

    Recommended Video

    Kathi Mahesh మరణంపై అనుమానాలు? ఆక్సిజన్ పైప్ పీకేశారా? || Filmibeat Telugu
    లేచి వస్తాడనుకుంటే

    లేచి వస్తాడనుకుంటే


    నిజానికి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండడంతో ఆ విషయం కాస్త మరుగున పడింది. అయితే అంతా కోలుకున్నాడు ఇక మరికొద్ది రోజుల్లో లేచి వస్తాడు అని ప్రచారం జరుగుతున్న క్రమంలో అనుకోకుండా మరణించడం ఇప్పుడు కలకలం రేపుతోంది.

    అనుమానాలు

    అనుమానాలు

    అయితే కత్తి మహేష్ మృతి వెనుక తమకు అనుమానాలున్నాయని మందకృష్ణ మాదిగ సహా కత్తి మహేష్ తండ్రి ఓబులేసు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా ఈ విషయం మీద విచారణ జరిపించాలని డిమాండ్ చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది.

    ఆయనకు అందుకే

    ఆయనకు అందుకే

    కత్తి మహేష్ తో పాటు ప్రయాణిస్తున్న సురేష్ అనే వ్యక్తి ఈరోజు నెల్లూరు జిల్లా పోలీసులు విచారణ చేశారు. ఈ విచారణ సందర్భంగా తనకు ఎందుకు గాయాలు కాలేదు కత్తి మహేష్ కు మాత్రమే ఎందుకు గాయాలు అయ్యాయి అనే అంశం మీద సురేష్ పోలీసులకు వివరాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.

    డ్రైవింగ్ రాదు

    డ్రైవింగ్ రాదు

    కత్తి మహేష్ కి డ్రైవింగ్ వచ్చినా సరే పూర్తిస్థాయిలో రాదు కాబట్టే తను డ్రైవింగ్ చేయమని కోరాడు అని తాము చిత్తూరు జిల్లాలోని కత్తి మహేష్ స్వగ్రామానికి వెళ్తున్నాము అని ఆయన చెప్పుకొచ్చారు. తాను సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల పెద్దగా గాయాలు కాలేదని కానీ ఆయన సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో ప్రమాదం జరిగిన వెంటనే ముందుకు వెళ్లి తలకు గాయాలయ్యాయి అని చెప్పుకొచ్చాడు.

    సోదరికి సమాచారం ఇచ్చా

    సోదరికి సమాచారం ఇచ్చా


    ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడమే కాదు కత్తి మహేష్ సోదరికి కూడా సమాచారం ఇచ్చానని సురేష్ చెప్పుకొచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి నెల్లూరు సీఐ మాట్లాడుతూ కత్తి మహేష్ కేసుని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని, కేసులో సురేష్ ని విచారించామని, ఇంకా కొంత మందిని విచారించాల్సి ఉందని అన్నారు.

    English summary
    we all know Manda Krishna has suspected a plot behind kathi mahesh death as he had several opponents. now kathi mahesh friend has been interoggated by ap police
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X