Don't Miss!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
వెంకీ మామలో రాజకీయం.. ఒక రేంజ్లో సన్నివేశం!
వెంకటేష్ కొత్త చిత్రం వెంకీ మామ షూటింగ్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా ఈ మల్టీస్టారర్ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని దరకుడు బాబీ. వెంకటేష్ వరుసగా మల్టీస్టార్ చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఇటీవల ఉగాది సందర్భంగా వెంకీ మామ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్లో వెంకటేష్, నాగ చైతన్య కూల్ లుక్లో కనిపిస్తున్నారు. రైతులు, జవాన్ల ప్రాముఖ్యతని తెలియజేసేలా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ చిత్రంలో మరో కోణం కూడా వెలుగులోకి వచ్చింది. వెంకీ మామ చిత్రంలో రాజకీయ అంశాలు కూడా ప్రస్తావనకు ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు బాబీ వెంకీ మామ చిత్రంలో అత్యంత కీలకమైన రాజకీయ సన్నివేశాలు చిత్రీకరిస్తునట్లు వార్తలు వస్తున్నాయి. వెంకటేష్, నాగచైతన్య తోపాటు 100 మంది జూనియర్ ఆర్టిస్టులు కలసి నటించే ఈ సన్నివేశాలు వెంకీ మామ చిత్రంలో హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.
జైలవకుశ తర్వాత దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్, నాగ చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరగా ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసి దసరాకు విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు.