Don't Miss!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఎన్టీఆర్ కొత్త సినిమాకు బాలీవుడ్ బ్యూటీ కాదు: మరోసారి ఆమెతోనే రొమాన్స్
కొంత కాలంగా వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ జోష్తో కనిపిస్తున్నాడు నందమూరి హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ ఉత్సాహంతో ప్రస్తుతం అతడు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం) అనే సినిమాలో రామ్ చరణ్తో కలిసి నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే తారక్.. టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఆ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోయే సినిమాలో హీరోయిన్ ఎవరన్న దానిపై ఎన్నో వార్తలు వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. మొదటి నుంచీ ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీని తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత జాన్వీ కపూర్ సహా పలువురు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు పూజా హెగ్డే ఫిక్స్ అయిందట. ఇప్పటికే ఇందులో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని అంటున్నారు. గతంలో ఎన్టీఆర్.. పూజా హెగ్డే 'అరవింద సమేత.. వీరరాఘవ' అనే సినిమాలో నటించారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎన్నో వార్తలు ఫిలిం నగర్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమా పొలిటికల్ బ్యాగ్డ్రాప్తో రాబోతుందని అంటున్నారు. పల్లెటూరి నుంచి వచ్చిన యువకుడు దేశ రాజకీయాలను శాసించేలా ఎదగడమే ఈ మూవీ స్టోరీ అని అంటున్నారు. ఇక, ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యూనివర్శల్ కాన్సెప్టుతో పాన్ ఇండియా రేంజ్తో రాబోతుంది.