Don't Miss!
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- News పోటీ నుంచి తప్పుకున్న శ్రీరాములు భార్య, రంగంలోకి గాలి జనార్దన్ రెడ్డి, వార్ వన్ సైడ్ కాదు, పోటీ !
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
పూజాహెగ్డేపై డ్రంక్ డ్రైవ్ రూమర్లు.. మేనేజర్ వార్నింగ్
అందాల తార పూజా హెగ్డే వరుస చిత్రాలతో మోత మోగిస్తున్నారు. తక్కువ కాలంలోనే అగ్రహీరోలందరితో కలిసి పనిచేయడం తెలిసిందే. తాజాగా ఆమె నటించిన మహర్షి సినిమా రిలీజై భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. అయితే మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్బంగా ఆమెపై ఓ రూమర్ వైరల్ అయింది. ఫంక్షన్ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్లో తన మేనేజర్తోపాటు పట్టుపడ్డారనే వార్త మీడియాలో వైరల్ అయింది. అయితే తాజాగా అ వివాదాస్పద వార్తపై మేనేజర్ వివరణ ఇచ్చారు.
పూజా మేనేజర్ హరి మీడియాకు వెల్లడించిన సమాచారం ప్రకారం.. మేము ప్రయాణిస్తున్న వాహనం డ్రంక్ డ్రైవ్లో దొరికినట్టు వచ్చిన వార్తలు నిరాధారం. వాటిలో ఎలాంటి వాస్తవాలు లేవు. హైదరాబాద్ సిటీలో ప్రయాణించడానికి పూజా హెగ్డే ఎప్పుడూ సొంత వాహనాలు ఉపయోగించదు. ప్రొడక్షన్కు సంబంధించిన వాహనంలోనే ఆమె ప్రయాణిస్తుంది. ఆ రోజు అర్ధరాత్రి 12.20 గంటలకు ఎయిర్పోర్టులో డ్రాప్ చేశాం. అప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి అనే విషయాన్ని గుర్తు చేశారు.
ఒకవేళ మేము ప్రయాణిస్తున్న వాహనం డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేస్తారు. అలాంటిదేమీ జరుగలేదే. అవాస్తవాలతో కూడిన వార్తలపై హరి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాంటి రూమర్లను వ్యాప్తి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొంటాం అని పూజా హెగ్డే మేనేజర్ అన్నారు.
ఇదిలా ఉండగా, సూపర్స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే నటించిన మహర్షి చిత్రం గ్రాండ్గా రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజైన ఘనతను సొంతం చేసుకొన్నది. భారీగా వసూళ్లను రాబట్టే అవకాశం కనిపిస్తున్నది.