Don't Miss!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- News వైసీపీలోకి జనసేన మఖ్య నేతలు - పిఠాపురం పై గురి..!!
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
‘ఆచార్య’లో బుట్టబొమ్మ కూడా: ముఖ్యమైన పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బ్యూటీ
రాజకీయాల కోసం తీసుకున్న గ్యాప్ను వరుస సినిమాలతో భర్తీ చేయాలని చూస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇందులో భాగంగానే రీఎంట్రీ తర్వాత ఆయన వేగంగా సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రెండు భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్.. ప్రస్తుతం టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న 'ఆచార్య'లో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది.
'ఆచార్య'లో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు ముప్పై నిమిషాల పాటు ఉండే అతడి క్యారెక్టర్ సినిమాకే హైలైట్గా నిలుస్తుందని అంటున్నారు. ఇందులో చెర్రీ నక్సలైట్గా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. ఈ చిత్రంలో అతడికి జోడీగా హీరోయిన్ పాత్ర కూడా ఉంటుందని అంటున్నారు. దాని కోసం రష్మిక మందన్నాను తీసుకున్నారని ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇటీవల ఆమె స్థానంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీని ఎంపిక చేసుకున్నానే టాక్ వినిపించింది.
తాజా సమాచారం ప్రకారం.. ఆ ఇద్దరు హీరోయిన్లు కాకుండా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేను తీసుకోబోతున్నారట. ఇప్పటికే ఆమెతో చిత్ర యూనిట్ సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, ఇందులో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇక, ఇందులో ఆయన దేవాదాయ శాఖలో పని చేసే ఉద్యోగిగానూ, నక్సలైట్గానూ రెండు విభిన్నమైన పాత్రలను పోషించబోతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. మెగా మల్టీస్టారర్గా రాబోతుండడంతో ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.