Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
‘ఆచార్య’లో బుట్టబొమ్మ కూడా: ముఖ్యమైన పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బ్యూటీ
రాజకీయాల కోసం తీసుకున్న గ్యాప్ను వరుస సినిమాలతో భర్తీ చేయాలని చూస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇందులో భాగంగానే రీఎంట్రీ తర్వాత ఆయన వేగంగా సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రెండు భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్.. ప్రస్తుతం టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న 'ఆచార్య'లో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది.
'ఆచార్య'లో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు ముప్పై నిమిషాల పాటు ఉండే అతడి క్యారెక్టర్ సినిమాకే హైలైట్గా నిలుస్తుందని అంటున్నారు. ఇందులో చెర్రీ నక్సలైట్గా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. ఈ చిత్రంలో అతడికి జోడీగా హీరోయిన్ పాత్ర కూడా ఉంటుందని అంటున్నారు. దాని కోసం రష్మిక మందన్నాను తీసుకున్నారని ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇటీవల ఆమె స్థానంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీని ఎంపిక చేసుకున్నానే టాక్ వినిపించింది.
తాజా సమాచారం ప్రకారం.. ఆ ఇద్దరు హీరోయిన్లు కాకుండా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేను తీసుకోబోతున్నారట. ఇప్పటికే ఆమెతో చిత్ర యూనిట్ సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, ఇందులో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇక, ఇందులో ఆయన దేవాదాయ శాఖలో పని చేసే ఉద్యోగిగానూ, నక్సలైట్గానూ రెండు విభిన్నమైన పాత్రలను పోషించబోతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. మెగా మల్టీస్టారర్గా రాబోతుండడంతో ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.