Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మరోసారి విరుచుకుపడ్డ పూనమ్.. వాళ్ళ కంటే వ్యభిచారులే బెటర్ అంటూ సెన్సేషన్
తెలుగు సినీ ఇండస్ట్రీలో గ్లామర్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న పూనమ్ కౌర్.. సరైన పాపులారిటీ మాత్రం సంపాదించలేకపోయింది. సినిమా ఛాన్సులు పట్టి ప్రేక్షకులను బుట్టలో వేసుకోవడంతో విఫలమైంది. కానీ పవన్ కళ్యాణ్ ద్వారా మాత్రం బాగా ఫేమస్ అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు సంచలనం సృష్టిస్తుండటం పూనమ్ స్టైల్. ఈ నేపథ్యంలోనే పూనమ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆన్లైన్ వేదికలపై సెన్సేషన్గా మారాయి. వివరాల్లోకి పోతే..
సోషల్ మీడియాలో పూనమ్ హవా.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
పూనమ్ సినిమా ఛాన్సులు ఏమో గానీ.. ఎప్పుడూ సోషల్ మీడియా మాత్రం హవా నడిపిస్తూనే ఉంటుంది. సామాజిక మాధ్యమాల ద్వారా టచ్లో ఉంటూ నిరంతరం తనకు సంబంధించిన విషయాలు, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ షేక్ చేస్తుంది. అలాగే సామాజిక అంశాలపైనా స్పందిస్తూ కొన్నిసార్లు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది.
దిశ ఎన్కౌంటర్పై స్పందన.. సినీ, రాజకీయ నాయకులపై కామెంట్
ఈ క్రమంలోనే ఇటీవలే జరిగిన దిశ ఎన్కౌంటర్పై స్పందించి చర్చల్లో నిలిచింది. ''ఉదయమే గుడ్ న్యూస్ విన్నాను. దిశకు న్యాయం చేసినందుకు తెలంగాణ సీఎం, తెలంగాణ డీజీపీకి ధన్యవాదాలు. ఇదే విధంగా నాతో పాటు కొంత మంది మహిళలను మోసం చేసిన సినీ అలియాస్ రాజకీయ నాయకులను కూడా శిక్షిస్తారని భావిస్తున్నా. ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు'' అని ట్వీట్ చేసింది పూనమ్.
|
పవన్ కళ్యాణ్ టార్గెట్గా ట్వీట్.. ఘాటుగా పూనమ్ రిప్లై
కొంతకాలంగా పవన్ కళ్యాణ్ టార్గెట్గా పూనమ్ ట్వీట్స్ చేస్తోంది కాబట్టి.. ఈ రెండు బెత్తం దెబ్బలు అనే కామెంట్ కూడా పవన్ పైనే చేసిందని, ఆ తర్వాత ఆ ట్వీట్ డిలీట్ చేసిందని వార్తలు వచ్చాయి. అయితే ఇలాంటి వార్తలపై పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా మరింత ఘాటుగా రిప్లై ఇచ్చింది.
|
వాళ్లంతా సైకోల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారో!
కొందరు పని గట్టుకుని మరీ తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని తెలుపుతూ ఫైర్ అయింది పూనమ్. ఆ ట్వీట్ తాను చేసింది కాదని మరోసారి స్పష్టం చేసింది పూనమ్ కౌర్. వాళ్లంతా సైకోల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదంటూ, ఓ వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఎందుకు ఇంతగా పిచ్చి రాతలు రాస్తున్నారని పూనమ్ ఆవేదన చెందింది.
Recommended Video
ఒళ్లు అమ్ముకుని జీవించే వ్యభిచారులు బెటర్
అమ్మాయిపై ఇలాంటి దుష్ప్రచారం చేసి తామెంత దిగజారిపోయామో మరోసారి తమను తాము నిరూపించుకుంటున్నారని అంటోంది పూనమ్. ఈ రాజకీయ నాయకులు, మీడియా వాళ్ల కంటే బతుకుదెరువు కోసం ఒళ్లు అమ్ముకుని జీవించే వ్యభిచారులు చాలా బెటర్ అంటూ ట్వీట్ చేసి సంచలనం సృష్టించింది పూనమ్ కౌర్.