twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇళయరాజా కుటుంబంలో విషాదం.. చిరకాల స్వప్పం తీరకుండానే తిరిగిరాని లోకాలకు.

    |

    ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కుటుంబంలో విషాదం చోటుచేసుకొన్నది. ఆయన పెద్దన్నయ్య, కవి, మ్యూజిక్ డైరెక్టర్ పవలార్ వరదరాజన్ కుమారుడు పవలార్ మైంథాన్ అలియాస్ జో మరణించారు. దాంతో ఇళయరాజ కుటుంబంలో విషాదం చోటుచేసుకొన్నది. సినీ పరిశ్రమలో జో కో డైరెక్టర్‌గా, మాటల రచయితగా పలు సక్సెస్‌ఫుల్ చిత్రాలకు పనిచేశారు. తమిళ సినిమాలో ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకొన్న జో మరణం సినీ పరిశ్రమను దిగ్బ్రాంతికి గురిచేసింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

    దర్శకుడు ఆర్‌వీ ఉదయకుమార్ రూపొందించిన కార్తీక్, రేవతి నటించిన కిజక్కు వాసల్, కమల్ హాసన్ నటించిన సింగర వెలన్, విజయ్ కాంత్, సుకన్య జంటగా నటించిన చిన్న గౌండర్ చిత్రాలకు కో డైరెక్టర్‌గా పనిచేశారు. కర్క కడదరా అనే చిత్రంతోపాటు పలు చిత్రాలకు డైలాగ్స్ రాశారు. నాలు పెరమ్ రొంబా నల్లవంగా అనే చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

     Popular Music Director Ilayarajas nephew Pavalar Mainthan passed away

    దర్శకుడిగా మారాలనే చిరకాలం స్వప్నం తీరుకుండానే జో మరణించడం సినీ పరిశ్రమ వర్గాలను తీవ్ర ఆవేదనకు గురిచేస్తుంది. కనీసం తన మొదటి చిత్రం విడుదలయ్యి ఉంటే బాగుండేదనే బాధను వ్యక్తం చేస్తున్నారు. తమిళ చిత్ర పరిశ్రమ ఓ టాలెంటెడ్ వ్యక్తిని కోల్పోయిందని సినీ ప్రముఖులు తమ సంతాపంలో పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు తీరని నష్టం అని సంతాపంలో తెలిపారు.

    English summary
    Music Director Ilayaraja's nephew Pavalar Mainthan passed away. He worked for many hit films in the Tamil Industry. He has started his first directorial movie Naalu Perum Romba Nallavanga which is under production.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X