Don't Miss!
- Sports RCB vs KKR: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన మిచెల్ స్టార్క్! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఇళయరాజా కుటుంబంలో విషాదం.. చిరకాల స్వప్పం తీరకుండానే తిరిగిరాని లోకాలకు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కుటుంబంలో విషాదం చోటుచేసుకొన్నది. ఆయన పెద్దన్నయ్య, కవి, మ్యూజిక్ డైరెక్టర్ పవలార్ వరదరాజన్ కుమారుడు పవలార్ మైంథాన్ అలియాస్ జో మరణించారు. దాంతో ఇళయరాజ కుటుంబంలో విషాదం చోటుచేసుకొన్నది. సినీ పరిశ్రమలో జో కో డైరెక్టర్గా, మాటల రచయితగా పలు సక్సెస్ఫుల్ చిత్రాలకు పనిచేశారు. తమిళ సినిమాలో ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకొన్న జో మరణం సినీ పరిశ్రమను దిగ్బ్రాంతికి గురిచేసింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
దర్శకుడు ఆర్వీ ఉదయకుమార్ రూపొందించిన కార్తీక్, రేవతి నటించిన కిజక్కు వాసల్, కమల్ హాసన్ నటించిన సింగర వెలన్, విజయ్ కాంత్, సుకన్య జంటగా నటించిన చిన్న గౌండర్ చిత్రాలకు కో డైరెక్టర్గా పనిచేశారు. కర్క కడదరా అనే చిత్రంతోపాటు పలు చిత్రాలకు డైలాగ్స్ రాశారు. నాలు పెరమ్ రొంబా నల్లవంగా అనే చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
దర్శకుడిగా మారాలనే చిరకాలం స్వప్నం తీరుకుండానే జో మరణించడం సినీ పరిశ్రమ వర్గాలను తీవ్ర ఆవేదనకు గురిచేస్తుంది. కనీసం తన మొదటి చిత్రం విడుదలయ్యి ఉంటే బాగుండేదనే బాధను వ్యక్తం చేస్తున్నారు. తమిళ చిత్ర పరిశ్రమ ఓ టాలెంటెడ్ వ్యక్తిని కోల్పోయిందని సినీ ప్రముఖులు తమ సంతాపంలో పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు తీరని నష్టం అని సంతాపంలో తెలిపారు.