Don't Miss!
- News జగన్ సీఎం కావాలని చెప్పుల్లేకుండా అభిమాని దీక్ష-స్వయంగా వెళ్లి విరమింపజేసిన వైనం..!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
మరోసారి ఆ ప్రయత్నం చేయబోతున్న పోసాని!
దర్శకుడిగా విజయాలను ఎక్కువగా అందుకోలేకపోయిన పోసాని కృష్ణ మురళి, నటుడిగా బిజీ అయ్యారు. కామెడీ టచ్ తో ఉండే నేటిటివ్ రోల్స్ కు ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. చాలా చిత్రాల్లో పోసాని పోషించే పాత్రలు ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తున్నాయి. నటుడికంటే ముందుగా ఆయన అద్భుతమైన రచయిత. వందలాది చిత్రాలకు రచనలు చేశారు. మెంటల్ కృష్ణ, ఆపరేషన్ దుర్యోధన లాంటి చిత్రాలతో దర్శకుడిగా కూడా మారాడు.
ఆ చిత్రాలు పోసానికి దర్శకుడిగా మంచి గుర్తింపు తీసుకువచ్చినా కమర్షియల్ గా మాత్రం విజయం సాధించలేదు. నటుడిగా బిజీ అయ్యాక దర్శత్వం జోలికి వెళ్ళలేదు. ప్రస్తుతం పోసాని టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్. ఇదిలా ఉండగా పోసాని త్వరలో మెగాఫోన్ పట్టే ప్రయత్నంలో ఉన్నాడనేది తాజా సమాచారం.మెగాఫోన్ పట్టే ప్రయత్నంలో ఉన్నాడనేది తాజా సమాచారం. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాల ఆధారంగా ఆయన ఒక కథను సిద్ధం చేసుకున్నాడట.
సింగిల్ షెడ్యూల్ లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నటీనటులు ఎవరు.. ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే విషయాలు త్వరలో తెలియనున్నాయి. పోసాని కృష్ణ మురళి రాజకీయాలపై కూడా తరచుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు.