Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అదే మా అదృష్టం.. లేకపోతే వేరేలా ఉండేది: పూజా హెగ్డే
'ముకుంద' సినిమాతో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా మారింది. నేటితరం స్టార్ హీరోలకు బెటర్ ఛాయిస్గా మారిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ సినిమాలో, అలాగే అక్కినేని అఖిల్ సరసన మరో సినిమాలో నటిస్తోంది.
ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో పూజా హెగ్డే రోల్ చాలా కీలకంగా ఉండనుందని సమచారం. అలాగే పూజా అందాలకు పదును పెడుతూ ఆమెను మరింత గ్లామర్ గా చూపించనున్నారని టాక్. గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఇటీవలే జార్జియా షెడ్యూల్ పూర్తిచేసింది.
క్రమంగా కరోనా వ్యాప్తి ప్రారంభమవుతున్న దశలోనే ప్రభాస్, పూజా హెగ్డే సహా ఈ మూవీ యూనిట్ అంతా జార్జియా వెళ్లివచ్చింది. అక్కడినుంచి తిరిగిరాగానే అంతా హోమ్ క్వారంటైన్ లో ఉండిపోయారు. కాగా తాజాగా అప్పటి అనుభవాలను పంచుకుంది పూజా హెగ్డే. జార్జియాకు వెళ్లే ముందు, షూటింగ్ జరుగుతున్న సమయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పింది.
జార్జియా నుంచి భారత్కు వచ్చేయగానే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయానని పూజా తెలిపింది. లాక్డౌన్కు ముందే భారత్కు తిరిగి వచ్చేయడం తమ అదృష్టమని, లేకపోతే ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరితిత్తి ఉండేదని పూజా చెప్పుకొచ్చింది.