Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అదే మా అదృష్టం.. లేకపోతే వేరేలా ఉండేది: పూజా హెగ్డే
'ముకుంద' సినిమాతో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా మారింది. నేటితరం స్టార్ హీరోలకు బెటర్ ఛాయిస్గా మారిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ సినిమాలో, అలాగే అక్కినేని అఖిల్ సరసన మరో సినిమాలో నటిస్తోంది.
ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో పూజా హెగ్డే రోల్ చాలా కీలకంగా ఉండనుందని సమచారం. అలాగే పూజా అందాలకు పదును పెడుతూ ఆమెను మరింత గ్లామర్ గా చూపించనున్నారని టాక్. గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఇటీవలే జార్జియా షెడ్యూల్ పూర్తిచేసింది.
క్రమంగా కరోనా వ్యాప్తి ప్రారంభమవుతున్న దశలోనే ప్రభాస్, పూజా హెగ్డే సహా ఈ మూవీ యూనిట్ అంతా జార్జియా వెళ్లివచ్చింది. అక్కడినుంచి తిరిగిరాగానే అంతా హోమ్ క్వారంటైన్ లో ఉండిపోయారు. కాగా తాజాగా అప్పటి అనుభవాలను పంచుకుంది పూజా హెగ్డే. జార్జియాకు వెళ్లే ముందు, షూటింగ్ జరుగుతున్న సమయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పింది.
జార్జియా నుంచి భారత్కు వచ్చేయగానే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయానని పూజా తెలిపింది. లాక్డౌన్కు ముందే భారత్కు తిరిగి వచ్చేయడం తమ అదృష్టమని, లేకపోతే ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరితిత్తి ఉండేదని పూజా చెప్పుకొచ్చింది.