Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
‘ఆదిపురుష్’కు ఆరంభంలోనే అపశకునం.. సెట్లో భారీ అగ్ని ప్రమాదం
ప్రభాస్ ఓం రావత్ సైఫ్ అలీ ఖాన్ కాంబోలో రాబోతోన్న ఆదిపురుష్ సినిమాకు ఆదిలోనే ఆటంకం ఏర్పడింది. ఆది పురుష్ ఆరంభ్ అంటూ ఎంతో ఘనంగా నేడు మూవీ షూటింగ్ను ప్రారంభించారు. ఈ మేరకు ముంబైలోని గోరే గావ్లో ఓ భారీ సెట్ను వేశారు. అయితే అంతా బాగానే జరుగుతుందనే సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయని తెలుస్తోంది. ఈ క్రమంలో యూనిట్ మొత్తం ఆందోళనకు గురైంది.
అయితే ప్రాణాపాయం ఏమీ లేకపోయినా సెట్ అంతా మంటల్లో చిక్కుకుని దగ్దమైనట్టు తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదానికి కారణం మాత్రం బయటకు రాలేదు. పైగా ఈ ఘటన జరిగిందంటూ ఇంత వరకు ఎవ్వరూ కూడా అధికారికంగా ధృవీకరించలేదు. ఇకనైనా ఆది పురుష్ టీం ఈ ఘటనపై స్పందిస్తుందా? లేదా? అన్నది చూడాలి. మరో వైపు అది అసలు ఆది పురుస్ సెట్టేనా? అనే అనుమానాలను కూడా నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి ఈ మూవీ ఆరంభంలోనే ఇలా నేషనల్ వైడ్గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో సీతగా కృతి సనన్, కౌసల్యగా హేమమాలిని, లక్ష్మణుడిగా సన్నీ సింగ్... రావణాసురుడి కుమారుడు మేఘనాథుడిగా అంగద్ బేడీలు నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్ 11న రిలీజ్ కానుంది. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ చిత్రంతో బిజీగా ఉన్నాడు.