Don't Miss!
- News మోదీ వలనే బంగారు రేటు పెరిగింది, ఐటీ అధికారులకు కళ్లు ఉన్నాయా, టీడీపీతో పొత్తు పెట్టుకుని ?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘ఆదిపురుష్’కు ఆరంభంలోనే అపశకునం.. సెట్లో భారీ అగ్ని ప్రమాదం
ప్రభాస్ ఓం రావత్ సైఫ్ అలీ ఖాన్ కాంబోలో రాబోతోన్న ఆదిపురుష్ సినిమాకు ఆదిలోనే ఆటంకం ఏర్పడింది. ఆది పురుష్ ఆరంభ్ అంటూ ఎంతో ఘనంగా నేడు మూవీ షూటింగ్ను ప్రారంభించారు. ఈ మేరకు ముంబైలోని గోరే గావ్లో ఓ భారీ సెట్ను వేశారు. అయితే అంతా బాగానే జరుగుతుందనే సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయని తెలుస్తోంది. ఈ క్రమంలో యూనిట్ మొత్తం ఆందోళనకు గురైంది.
అయితే ప్రాణాపాయం ఏమీ లేకపోయినా సెట్ అంతా మంటల్లో చిక్కుకుని దగ్దమైనట్టు తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదానికి కారణం మాత్రం బయటకు రాలేదు. పైగా ఈ ఘటన జరిగిందంటూ ఇంత వరకు ఎవ్వరూ కూడా అధికారికంగా ధృవీకరించలేదు. ఇకనైనా ఆది పురుష్ టీం ఈ ఘటనపై స్పందిస్తుందా? లేదా? అన్నది చూడాలి. మరో వైపు అది అసలు ఆది పురుస్ సెట్టేనా? అనే అనుమానాలను కూడా నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి ఈ మూవీ ఆరంభంలోనే ఇలా నేషనల్ వైడ్గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో సీతగా కృతి సనన్, కౌసల్యగా హేమమాలిని, లక్ష్మణుడిగా సన్నీ సింగ్... రావణాసురుడి కుమారుడు మేఘనాథుడిగా అంగద్ బేడీలు నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్ 11న రిలీజ్ కానుంది. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ చిత్రంతో బిజీగా ఉన్నాడు.