twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Krishnam Raju: అంత బాధలో కూడా ఫ్యాన్స్ గురించి ఆలోచించిన ప్రభాస్.. వారి కోసం ప్రత్యేకంగా..

    |

    టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా ఎంతోమంది అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక సినీ ప్రముఖులు కూడా ఆయన మరణించడం ఇండస్ట్రీకి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రోజు కృష్ణంరాజుకి ఇష్టమైన వ్యవసాయ క్షేత్రంలోనే అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ కఠిన సమయంలో కూడా అక్కడికి వచ్చిన అభిమానుల గురించి ప్రభాస్ ఆలోచించిన విధానం అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ వివరాల్లోకి వెళితే..

    సినీ ప్రముఖుల నివాళి

    సినీ ప్రముఖుల నివాళి

    తీవ్ర అనారోగ్యంతో గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. కృష్ణంరాజు మృతిపట్ల టాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. రాజకీయ ప్రముఖులు కూడా ఆయనకు ప్రత్యేకంగా నివాళులర్పించారు.

    ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు

    ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు

    ఇక సోమవారం రోజు కృష్ణంరాజు అంతిమయాత్ర హైదరాబాద్ లో ఆయన స్వగృహం నుంచి మొదలైంది. ఇక ఆ అంతిమ యాత్రలో అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కనకమామిడి లోని కృష్ణంరాజు సొంత ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు నిర్వహించగా అక్కడి వరకు అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు.

    భారీ సంఖ్యలో అభిమానులు

    భారీ సంఖ్యలో అభిమానులు

    అయితే ఫ్యాన్స్ అందరూ కూడా కృష్ణంరాజు అంత్యక్రియలలో పాల్గొనేందుకు వచ్చినట్లు ప్రభాస్ కు తెలిసింది. అయితే భద్రతాకారణాల దృష్ట్యా పోలీసులు ఎవరిని ఫామ్ హౌస్ లోపలికి రానివ్వలేదు. ప్రభాస్ అంతకుముందే భారీ సంఖ్యలో ఫ్యాన్స్ వచ్చినట్లు తెలుసుకున్నాడు. ఇక పోలీస్ సెక్యూరిటీ నడుమ ప్రభాస్ కుటుంబ సభ్యులు ఫామ్ హౌస్ లోకి వెళ్లారు.

    ప్రత్యేకంగా భోజనాలు

    ప్రత్యేకంగా భోజనాలు

    అయితే ఫ్యాన్స్ చాలా దూరం నుంచి కృష్ణంరాజు ఇంటికి తరలి వస్తున్నట్లు తెలుసుకున్న ప్రభాస్ అంత కఠిన సమయంలో తీసుకున్న ఒక నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. చాలామంది ఆకలితో ఉంటారు కాబట్టి వచ్చిన ప్రతీ ఒక్క అభిమానికి భోజనాలు ఏర్పాట్లు చేయించాడు. అలాగే దాహంగా ఉంటారు కాబట్టి అందరికి అందుబాటులో వాటర్ బాటిల్స్ అందేలా కూడా చర్యలు తీసుకున్నారు.

     ఎప్పటిలానే అదే ప్రేమ

    ఎప్పటిలానే అదే ప్రేమ

    ఫ్యాన్స్ ఎప్పుడు వచ్చినా కూడా కృష్ణంరాజుతో పాటు ప్రభాస్ కూడా వీలైనంత వరకు వారిని కలుసుకునేందుకు సిద్ధంగా ఉండేవారు. అలాగే భోజనాలు పెట్టించి పంపిస్తూ ఉంటారు. ఇక రెబల్ స్టార్ ను కడసారి చేసేందుకు వచ్చిన అభిమానులను కూడా ప్రభాస్ ప్రత్యేకంగా గుర్తించి బోజన ఏర్పాట్లు చేశాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారుతోంది.

    English summary
    Prabhas family provided food for all fans in krishnam raju house..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X