Don't Miss!
- News రామేశ్వరం కేఫ్ కేసులో ట్విస్ట్, క్లాస్ మేట్ కోసం ఏం చేశాడంటే?, బాంబర్ తో అన్ని నెలలు!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
డార్లింగ్ డేరింగ్ స్టెప్.. రాధేశ్యామ్ షూటింగ్ ప్రారంభం.. పూజాతో ప్రభాస్ రొమాన్స్!!
ప్రస్తుతం ప్రభాస్ పేరు దేశమంతా మార్మోగిపోతోంది. అసలు సిసలైన ప్యాన్ ఇండియన్ స్టార్గా ప్రభాస్ ఆవిర్భవించాడు. బాహుబలి సినిమాతో ప్రభాస్ జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు. బాహుబలి పాత్రతో ప్రభాస్ ఖ్యాతీ ఖండాలు దాటిపోయింది. ఇక సాహో చిత్రంతో ప్రభాస్ తన స్టామినాను చాటాడు. దాదాపు 400 కోట్లను కొల్లగొట్టి బాక్సాఫీస్ను షేక్ చేశాడు. ఇక ఈ చిత్రం వచ్చి చాలా రోజులు కావడం, మరో సినిమాను ఫ్యాన్స్కు అందించడంలో కాస్త ఆలస్యమవుతోంది.
రాధేశ్యామ్ ఆలస్యం..
సాహో చిత్రం షూటింగ్ జరుగుతుండగానే రాధేశ్యామ్ ఓ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. అయితే విభిన్న కారణాల వల్ల ప్రతీసారి రాధేశ్యామ్ షెడ్యూల్ మారడం, షూటింగ్ క్యాన్సిల్ చేయడం వంటివి జరుగుతూ వచ్చింది. ఇలా జరగడంతో రాధేశ్యామ్ ఆలస్యమైంది.
కరోనా దెబ్బ..
అసలే అనుకున్న సమయానికి షూటింగ్ జరగడం లేదని అంతా ఆందోళన చెందితే కరోనా పెద్ద దెబ్బ కొట్టింది. కరోనా కారణంగా రాధేశ్యామ్ పూర్తిగా వెనుకబడింది. అప్డేట్ ఇవ్వండంటూ ఫ్యాన్స్ చేసే రచ్చను భరించలేక రాధేశ్యామ్ అనే టైటిల్, రొమాంటిక్ పోస్టర్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
‘ఆది పురుష్'గా ప్రభాస్..
ఇక డార్లింగ్ ఫ్యాన్స్ను ఈ మధ్య తెగ సంతోషపెట్టిన వార్త ఒకటి ఉంది. ప్యాన్ ఇండియన్ చిత్రంగా ఆది పురుష్ అని ప్రకటించడం, ఆ సినిమాలో రాముడిగా ప్రభాస్ కనిపించబోతోన్నాడని తెలియడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందంలో తేలిపోయారు. ఇక తాజాగా మరో వార్త ప్రభాస్ ఫ్యాన్స్లో ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది.
Recommended Video
షూటింగ్ రీస్టార్ట్..
కరోనా కారణంగా షూటింగ్కు గ్యాప్ ఇచ్చిన చిత్రయూనిట్.. తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. రాధేశ్యామ్ షూటింగ్ను త్వరలోనే ప్రారంభించబోతోన్నట్టు ప్రకటించింది. ఈ మేరకు డార్లింగ్ ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య రొమాంటిక్ షెడ్యూల్ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగ్కు సై అన్న ప్రభాస్ డేరింగ్ స్టెప్ వేసినట్టే. అది కూడా హీరోయిన్తో రొమాన్సే చేయడం అంటే మామూలు విషయం కాదు.