చిరంజీవి కోసం ప్రభాస్ కాంప్రమైజ్.. విశ్వంభర విడుదల అప్పుడేనా?
Prabhas - Chiranjeevi: సలార్, కల్కి 2898, లాంటి బ్లాక్బస్టర్ హిట్స్ తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ జోష్ లో ఉన్నారు. వరుస విజయాలతో దూసుకు వెళ్తున్నారు. ప్రస్తుతం మారుతీ డైరెక్షన్ లో 'ది రాజా సాబ్' గా ప్రేక్షక ముందుకు రాబోతున్నారు. అయితే .. మెగాస్టార్ చిరంజీవి కోసం ప్రభాస్ కాంప్రమైజ్ కాబోతున్నాడట. ఇంతకీ ఏ విషయంలో ప్రభాస్ వెనక్కి తగ్గాడు? అనే వివరాల్లోకి వెళితే..
ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. వరుస పాన్ ఇండియా విజయాలతో దూసుకు వెళ్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో 'రాజా సాబ్' కామెడీ తో ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిపోయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతున్నట్టు ఇప్పటికే మూవీ మేకర్లు ప్రకటించారు. ఈ భారీ బడ్జెట్ మూవీని టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

'ది రాజా సాబ్'మూవీలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించారు. వచ్చే ఏడాది జనవరి సమయానికి ఈ సినిమా షూటింగ్ పూర్తికాబోతోంది. కానీ ఈ సినిమాలో ఎక్కువ సీన్లకు VFX వర్క్ లింక్ అయి ఉండడంతో .. దాదాపు గ్రాఫిక్స్ వర్క్ కోసం కనీసం మూడు నెలల సమయం కేటాయించాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యింది. దీంతో 'ది రాజా సాబ్'విడుదల వచ్చే ఏడాది ఏప్రిల్ 10 న చేయాలని మూవీ యూనిట్ భావిస్తుంది. వాస్తవానికి సంక్రాంతి నిలుస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. కానీ ఆశించిన ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైందని చెప్పాలి.
కానీ, ప్రస్తుతం పరిస్థితుల్లో 'రాజా సాబ్' ఏప్రిల్లో రిలీజ్ కావడం కష్టమేనని తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి 'రాజా సాబ్' వాయిదా పడిందని, ఆ ప్లేస్లో మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' సినిమాని రిలీజ్ చేయాలని భావిస్తున్నారంట. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' మూవీ తొలుత సంక్రాంతికి విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావించారు. ఆ ప్రకారంగానే షెడ్యూల్ కూడా చేసుకున్నారు. కానీ, సడన్ గా రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' సంక్రాంతి బరిలో నిలవడంతో మెగాస్టార్ చిరంజీవి తన సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 95 % పూర్తయింది. మిగతా షూటింగ్ డిసెంబర్ చివరి వరకు పూర్తి కాబోతోంది.

ఇటు రాజ్యసభ మూవీ హర్రర్ కామెడీగా తెరకెక్కుతుండగా, చిరంజీవి 'విశ్వంభర' మూవీగా తెరకెక్కుతుంది. ఈ రెండు సినిమాలకు మెయిన్ గ్రాఫిక్స్. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ కు విఎఫ్ఎక్స్ వర్క్ ఉండడంతో ఎడిటింగ్ కు దాదాపు మూడు నెలల సమయం పట్టబోతుంది. దీంతో ఇటు ప్రభాస్ 'ది రాజా సాబ్' కు చిరంజీవి 'విశ్వంభర' వరకు మధ్య క్లాస్ కాబోతుంది. ఈ క్రమంలో చిరంజీవికి ఛాన్స్ ఇస్తూ ప్రభాస్ వెనుకకు తగ్గే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఈ విషయంపై అధికార ప్రకటన రావాల్సింది.


Click it and Unblock the Notifications











