Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అతి భయంకరమైన ‘జాంబీ’లు.. హిట్ కొట్టబోతోన్న ప్రశాంత్ వర్మ
ప్రశాంత్ వర్మ కథలు కథనాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తిగా తెరకెక్కించిన జాంబీరెడ్డికి కరోనా వైరస్, లాక్డౌన్ నేపథ్యాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మనిషికి వింత రోగం రావడం ఎదుటి వారిని కరవడం, వారు కూడా అలానే మారడం వంటి కాన్సెప్ట్లు ఎక్కువగా హాలీవుడ్లోఉంటాయి. అచ్చం అలాంటి ఓ కథను మన నేటివిటీకి తగ్గట్టు జాంబిరెడ్డిగా మనముందుకు తీసుకురాబోతోన్న ప్రశాంత్ వర్మ.
అ!, కల్కి వంటి చిత్రాలతో వినూత్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ.. జాంబీరెడ్డితో మరో హిట్ కొట్టేలానే ఉన్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ తేజ.. హీరోగా చేస్తోన్న ఈ మొదటి చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. కామెడీ, యాక్షన్, హారర్ ఇలా ప్రతీ ఒక్కటి ఇందులో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక ట్రైలర్ చివర ఇచ్చిన ఎండింగ్ కూడా అదిరిపోయింది.
నర రూప రాక్షసుల్లా మారి మనిషి మాంసాన్ని తింటున్న జాంబీలను చూపించడం, కరోనా వైరస్ బ్యాడ్ అయితే.. దాని డ్యాడి జాంబి రెడ్డి అన్నట్టుగా చూపించాడు. ప్రతీ సంక్రాంతికి అల్లుళ్లు వస్తే.. ఈ సంక్రాంతికి జాంబీలు వస్తున్నారని చెప్పడంతో ట్రైలర్ను ఎండ్ చేశారు. మొత్తానికి తెలుగు తెరకు సరికొత్త కాన్సెప్ట్ను పరిచయం చేసేందుకు ప్రశాంత్ వర్మ ఈ సారి పక్కా ప్లాన్ను సిద్దం చేసుకున్నట్టుకనిపిస్తోంది.