Don't Miss!
- Finance Rekha Jhunjhunwala: ఆ 5 కంపెనీల్లో షేర్లు అమ్మిన రేఖా జున్జున్వాలా.. టాటా స్టాక్స్ కూడా..
- News శ్రీరామ నవమి.. ఐదు శతాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. భావోద్వేగానికి గురైన ప్రధాని మోదీ
- Automobiles అప్రిలియా నుంచి 4 సూపర్ టూరర్ బైక్లు లాంచ్.. ఒక్కో బైక్లో ఎన్నో స్పెషాలిటీస్.!!
- Sports KKR vs RR: 12 నెలలుగా రిక్వెస్ట్ చేస్తున్నా.. అస్సలు వినడం లేదు: రోవ్మన్ పోవెల్
- Lifestyle వేసవిలో నిమ్మరసం లేదా కొబ్బరి బోండాం ఏది బెటర్? ఏది ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
- Technology WhatsApp మరియు Instagram లో Meta Ai ని ఎలా ఉపయోగించాలి? స్టెప్ బై స్టెప్ గైడ్
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
ప్రేక్షకులకు ప్రభాస్ రిక్వెస్ట్.. దయచేసి ఇలా చేయండని పేర్కొంటూ పోస్ట్
వాతావరణం మార్పులు చోటు చేసుకోవడం, అపరిశుభ్రత కారణంగా ప్రస్తుతం రాష్ట్రమంతా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఎంతో మంది ప్రజలు డెంగీ, టైఫాయిడ్ లాంటి వైరల్ ఫీవర్స్ బారిన పడుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వం పలు సూచనలు జారీ చేస్తూ చర్యలు చేపడుతోంది. తాజాగా ఈ అంశంపై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పందిస్తూ ఫేస్బుక్ పోస్ట్ పెట్టారు. ఆ వివరాలు చూస్తే..
ప్రజలంతా తగు జాగ్రత్తలు పాటించాలంటూ ప్రభాస్
విష జ్వరాలు విజృంభించడానికి ప్రధాన కారణం దోమలు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండకపోవడం కారణంగా దోమలు వ్యాప్తి చెందుతాయి. ఈ దోమల కారణంగా జనం అనారోగ్యం పాలవుతున్నారు. ఇప్పటికే విష జ్వరాలు బాగా వ్యాప్తి చెందాయి. ఈ నేపథ్యంలో దీనిపై ప్రభాస్ స్పందిస్తూ ప్రజలంతా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
మీ కుటుంబాన్ని రక్షించుకోండి.. ఇలా చేయండి
''దయచేసి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించుకోండి. డెంగ్యూ లాంటి విష జ్వరాల బారిన పడకుండా జాగ్రత్త పడండి. ఈ మేరకు మీ ఇల్లు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. మీ ఇంటి చుట్టూ ప్రక్కల మురుగు నీటి నిల్వలు లేకుండా చూసుకోండి.. అదేవిధంగా వాటర్ ట్యాంక్స్ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి'' అని తన పోస్ట్లో పేర్కొన్నారు ప్రభాస్.
తన ఇంటి పరిసరాలను పరిశీలిస్తూ దిగిన ఫొటో
తన పోస్ట్తో పాటు తన ఇంటి పరిసరాలను పరిశీలిస్తున్న పిక్ షేర్ చేశారు ప్రభాస్. దీంతో ఆయన చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. విష జ్వరాల బారిన పడకండి అంటూ ప్రభాస్ కల్పిస్తున్న అవగాహన చూసి ఆయన అభిమానులు సాహో అంటున్నారు. ప్రభాస్ చేసిన ఈ సూచన తప్పక పాటిస్తామని పేర్కొంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.
|
అంతకుముందు నాగార్జున
ఇదే విషయమై ఇప్పటికే అక్కినేని నాగార్జున స్పందించిన సంగతి తెలిసిందే. మీ ఇల్లు, పనిచేస్తున్న పరిసరాల్లో మురికి నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచిస్తూ ఆయన ట్వీట్ పెట్టారు. దీంతో సెలెబ్రిటీలు చేస్తున్న ఈ అవగాహనా కార్యక్రమాలపై సినీ, రాజకీయ వర్గాల్లో పాజిటివ్ స్పందన వస్తోంది.
సాహో.. ప్రభాస్
ఇక ప్రభాస్ తాజా సినిమా సాహో గురించి చెప్పుకుంటే.. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా 500 కోట్ల క్లబ్ దిశగా పరుగులు పెడుతోంది. చిత్రంలో ప్రభాస్, శ్రద్ద కపూర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. నిర్మాణ విలువలు భేష్ అనిపించుకున్నాయి. ప్రస్తుతం సాహో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.