Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘సాహో’ మేకింగ్ వీడియో విడుదల.. చూస్తే ఆశ్చర్యపోతారు.!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం 'సాహో'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తర్వాత వచ్చిన సినిమా కావడంతో దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక, నాలుగు భాషల్లో విడుదల కావడానికి తోడు భారీ బడ్జెట్తో వస్తున్న చిత్రం అని ప్రచారం జరగడంతో ఈ సినిమాపై క్యూరియాసిటీ ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ 'సాహో' విడుదలైన నాలుగు భాషల్లోనూ అత్యధిక కలెక్షన్లతో సత్తా చాటుతోంది.
టాక్తో సంబంధం లేకుండా ఈ సినిమా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో 'సాహో' మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో సినిమా కోసం వాడిన వస్తువులు, కార్లు, ట్రక్కులు, ఆయుధాలు సహా ఎన్నో విషయాలను చూపించారు. అలాగే, కొన్ని సీన్లను తెరకెక్కించ విధానాన్ని కూడా కళ్లకు కట్టారు. మధ్య మధ్యలో ప్రభాస్ సహా మిగిలిన నటులు, టెక్నీషియన్లు చిత్ర విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. మొత్తంగా ఈ వీడియో వావ్ అనిపించేలా ఉంది. ఇది చూస్తే అశ్యర్యపోవడం పక్కా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
తెలుగు సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమాల్లో 'సాహో' ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్తో 'రన్ రాజా రన్' ఫేం సుజిత్ తెరకెక్కించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించింది. ఈ సినిమా ఆగస్టు 30న నాలుగు భాషల్లో విడుదల అయింది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్తో తెరకెక్కిన 'సాహో' 2019 సంవత్సరానికి గానూ ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ క్రమంలోనే బాలీవుడ్లోని బడా హీరోల రికార్డులు బద్దలు కొట్టేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 350 కోట్లు వసూళు చేయడంతో.. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, కబీర్ సింగ్ రికార్డులు కనుమరుగైపోయాయి. అంతకుముందు కబీర్ సింగ్ రూ. 278 కోట్లు కలెక్ట్ చేయగా, సల్మాన్ ఖాన్ భారత్ రూ. 211 కోట్లు, అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్ రూ. 188 కోట్లు వసూలు చేశాయి. వీటిని ఇప్పుడు సాహో అధిగమించింది.