Don't Miss!
- News ఉండి టీడీపీలో వార్ - మారుతున్న లెక్కలు, ఆడియో వైరల్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ పదం వింటేనే ఇరిటేట్గా ఉంది.. చేసి చేసి విసిగిపోయా.. సాహో హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇటీవలే విడుదలైన భారీ సినిమా 'సాహో'. ఆగస్టు 30వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదట మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత పుంజుకొని కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాతోనే బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ టాలీవుడ్ తెరపైకి అడుగుపెట్టింది. దీంతో పాటుగా బాలీవుడ్లో సినిమాలు చేసిన శ్రద్దా కపూర్ ఓ ముఖ్యమైన విషయంలో తనకు ఇరిటేట్గా ఉందని చెప్పి షాకిచ్చింది. దీంతో ఒక్కసారిగా అంతా ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఏంటా విషయం? వివరాల్లోకి పోతే..
సినిమాకు ప్రాణం ప్రమోషన్స్.. ఆ ప్రమోషన్స్లో
సాధారణంగా ఎంత పెద్ద సినిమా అయినా, అది ఎంత భారీ బడ్జెట్ తో తెరకెక్కినా కూడా దానికి ప్రాణం పోసేది కేవలం ప్రమోషన్ మాత్రమే. ఈ రోజుల్లో అది మరీ ముఖ్యమైనదిగా మారింది. సినిమాను ఎంత ఎక్కువగా ప్రమోట్ చేస్తే అంత హైప్ క్రియేట్ అయి సినిమాపై అంచానాలు కూడా అదే రేంజ్లో పెరుగుతాయి. అది అక్షర సత్యం. అలాంటి ప్రమోషన్ విషయమై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది శ్రద్దా కపూర్.
భారీ సినిమా సాహో.. ఓ రేంజ్లో పర్యటనలు
ఫ్యాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, ఇతర సౌత్ ఇండియన్ భాషల్లోనూ విడుదలైంది సాహో మూవీ. విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తూ ఓ రేంజ్ ప్రమోషన్స్ చేశారు యూనిట్ సభ్యులు. ఈ మేరకు ప్రభాస్, శ్రద్దా కపూర్ సహా యూనిట్ అంతా కలిసి దేశమంతా పర్యటించి ప్రేక్షకులను పలకరించారు.
కష్టమవుతోందంటున్న శ్రద్దా కపూర్
సాహో విడుదలై సక్సెస్ఫుల్గా రన్ అవుతుండగానే శ్రద్దా కపూర్ నటించిన మరో సినిమా 'చిచ్చోరే' విడుదలకు సిద్ధమైంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్తో సరసన ఈ సినిమాలో నటించింది శ్రద్దా. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కూడా శ్రద్దా కపూర్ రంగంలోకి దిగింది. కాకపోతే ఇది కాస్త కష్టమవుతోందంటూ ఓ మీడియా సమావేశం ఆమె చెప్పడంతో అంతా షాకయ్యారు.
చేసి చేసి విసుగెత్తిపోయా అంటూ
సాహో ప్రమోషన్స్ అలా ఫినిష్ అయ్యాయో లేదో.. అప్పుడే 'చిచ్చోరే' ప్రమోషన్స్ మొదలయ్యాయి. దీంతో మళ్ళీ ఓ రేంజ్లో ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఛానెల్స్, దేశంలోని పలు ప్రాంతాలు తిరిగి తిరిగి విసిగెత్తిపోయా అని చెప్పుకొచ్చింది శ్రద్దా. ప్రమోషన్ అనే పదం వింటేనే తనను ఇరిటేట్ గా ఉందని ఈ సందర్భంగా శ్రద్దా చెప్పడం విశేషం.
సాహో మూవీ హంగామా
తెలుగు సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమాల్లో ‘సాహో' ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్తో ‘రన్ రాజా రన్' ఫేం సుజిత్ తెరకెక్కించాడు. పలు భాషల్లోని భారీ తారాగణం పాలుపంచుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అన్ని భాషల్లోనూ హంగామా కొనసాగిస్తోంది.