Don't Miss!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘సలార్’ రెండో షెడ్యూల్ అప్డేట్: ఆ సారి అలా కనిపించనున్న డార్లింగ్ ప్రభాస్
ఒకప్పుడు చిన్న చిన్న చిత్రాల్లో నటించినా పెద్ద పెద్ద విజయాలను అందుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అయితే, కొన్నేళ్లుగా అతడి పంథా పూర్తిగా మారిపోయింది. దీనికి కారణం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' అన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ సినిమా రిజల్ట్తో అతడి రేంజ్ పెరిగిపోవడం వల్ల వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఇప్పటికే జిల్ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తోన్న 'రాధే శ్యామ్' చేస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే మరిన్ని చిత్రాలను ప్రకటించాడు. అందులో యాక్షన్ ఎంటర్టైనర్ 'సలార్' ఒకటి.
KGF సిరీస్తో దేశ వ్యాప్తంగా మన్ననలు అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న చిత్రమే 'సలార్'. మాఫియా డాన్ కథతో రూపొందుతోన్న ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్లోనే తీస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం ప్రారంభం అవగా.. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల్లో మొదటి షెడ్యూల్ను పూర్తి చేసుకున్నారు. ఇందులో హీరో ఇంట్రడక్షన్ సీన్స్ తెరకెక్కించారు. అలాగే, ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ను కూడా షూట్ చేశారు. దానికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
ఇక, ఇప్పుడు ఈ మూవీ రెండో షెడ్యూల్ గురించి ఓ తాజాగా న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఇది ఏప్రిల్ మూడో వారం నుంచి ప్రారంభం కాబోతుందట. ఇందుకోసం హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఓ ప్రత్యేకమైన సెట్ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అందులోనే 'సలార్' సెకెండ్ షెడ్యూల్ ప్రారంభం అవుతుందని టాక్. ఇందులో ఫ్లాష్బ్యాక్కు సంబంధించిన సీన్స్ చిత్రీకరిస్తారట. ఇందుకోసం ప్రభాస్ డిఫరెంట్గా కనిపిస్తాడని అంటున్నారు. ఇక, హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్. ఈ చిత్రాన్ని 2022 ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.