Don't Miss!
- News జగన్కు షాక్..పిఠాపురంలో వైసీపీకి భారీగా రాజీనామాలు
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రభాస్ ఫ్యాన్స్కి సర్ప్రైజ్.. మొత్తానికి ఇలా చెప్పేశారు
'బాహుబలి' లాంటి భారీ సినిమా తర్వాత 'సాహో' రూపంలో ఊహించని డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు ప్రభాస్. దీంతో ఆయన ఫ్యాన్స్ నిరాశ చెందారు. అభిమానుల్లో నెలకొన్న ఆ వెలితిని ఎలాగైనా చెరిపేయాలనే స్ట్రాంగ్ డిసీజన్ తీసుకొని రాధాకృష్ణ దర్శకత్వంలో తన తర్వాతి సినిమా స్టార్ చేశారు ఈ యంగ్ రెబర్ స్టార్.
ప్రభాస్ కెరీర్లో 20వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రానికి ''జాన్'' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. 1960 కాలం నాటి కథతో యూరప్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతోందని, ఇందుకోసం దాదాపు 180 కోట్ల బడ్జెట్ కేటాయించారని టాక్. ఎప్పటినుంచో ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.
ఈ పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ రేపు (జనవరి 17) ఇవ్వబోతున్నామని పేర్కొంటూ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ రోజు కనుమ.. నేటితో సంక్రాంతి ముగుస్తుంది. అయితే అసలు సంక్రాంతి రేపే అంటూ ఈ ప్రకటన జారీ చేయడం విశేషం.
యూవీ క్రియేషన్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాకు గిభ్రాన్ సంగీతం సమకూర్చుతున్నారు. చిత్రంలో ప్రభాస్ సరసన యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో హస్త సాముద్రికం తెలిసిన వ్యక్తిగా ప్రభాస్ కనిపించనున్నాడని ఫిలిం నగర్ టాక్. మరి రేపు ప్రభాస్ అండ్ టీమ్ ఎలాంటి అప్డేట్ ఇవ్వనున్నారో చూద్దాం!.