Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సర్ప్రైజ్ ఇస్తానంటూ ప్రభాస్ సింగల్ డైలాగ్.. అదే విషయం చెప్పనున్నాడా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సర్ప్రైజ్ చేయబోతున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే పేర్కొంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు ప్రభాస్. హాయ్ డార్లింగ్స్.. రేపు మీకో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా.. నా ఇన్స్స్టాగ్రామ్ ఫాలో కండి అంటే కేవలం ఒకే ఒక్క డైలాగ్తో ఈ వీడియో ముగించారు ప్రభాస్. దీంతో ఇంతకీ ప్రభాస్ ఇవ్వబోతున్న ఆ సర్ప్రైజ్ ఏమై ఉంటుందా? అనే కోణంలో చర్చలు ఊపందుకున్నాయి.
39 ఏళ్ల ప్రభాస్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్గా కొనసాగుతున్నారు. దీంతో అందరి కళ్లు ప్రభాస్ పెళ్లి పైనే పడ్డాయి. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ప్రభాస్ పెళ్లిపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ మేరకు ప్రభాస్ తన పెళ్లి గురించిన సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు చాలామంది. ఇక మరోవైపు ప్రభాస్ సాహూ షూటింగ్లో పాల్గొంటున్నారు. అలాగే రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. దీంతో ఈ రెండు సినిమాల్లో ఏదో ఒక దానికి సంబందించిన సర్ప్రైజ్ ఏమైనా ఇస్తాడా? అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ప్రభాస్ పెట్టిన ఈ వీడియో అందరిలోనూ సరికొత్త ఆసక్తికి తెరలేపింది.
#SaahoUpdate pic.twitter.com/LtvEPXDJoe
— TeluguFilmibeat (@TeluguFilmibeat) May 20, 2019
ఇక టెక్నాలజీకి కాస్త దూరంగా ఉంటున్న ప్రభాస్ ఇటీవలే ఇన్స్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి సోషల్ మీడియాలో ఓ అడుగు ముందుకేశారు. ఆయనకు అఫీషియల్ ట్విట్టర్ ఖాతా కూడా లేదు. దీంతో ఈ కోణంలో కూడా దృష్టి సారించారు ప్రేక్షకులు. ఏదేమైనా సర్ప్రైజ్ ఇస్తానని స్వయంగా ప్రభాస్ చెప్పడం ఆయన అభిమాన వర్గాల్లో కొత్త జోష్ నింపింది.
ప్రభాస్ నటిస్తున్న సాహో విడుదలకు సిద్ధమవుతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ద కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్ లాంటి భారీ తారాగణం పాలుపంచుకుంటోంది. చిత్రాన్ని ఆగస్టు 15 న విడుదల చేయాలని పాలన్ చేస్తున్నారు మేకర్స్.