Don't Miss!
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'సాహో' కోసం వదిలేయక తప్పలేదు.. అందుకే.. ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా సినిమా 'సాహో'. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకొని ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఆగస్టు 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ సినిమా విశేషాలను తెలుపుతూ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు.
భారీ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా రాబోతున్న 'సాహో' కోసం శాఖాహారిగా మారారట ప్రభాస్. యాక్షన్ సీక్వెన్స్ చేయాలంటే కాస్త సన్నబడాలని యూనిట్ సూచించడంతో.. బరువు తగ్గేందుకై పూర్తిగా వెజిటేరియన్ గా మారానని ప్రభాస్ అన్నారు. దాదాపు ఐదు నెలల పాటు శాఖాహారమే తీసుకున్నానని ఆయన తెలిపారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్పై దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్తో హై టెక్నికల్ వాల్యూస్తో తెరకెక్కింది సాహో సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. హీరోయిన్ శ్రద్ద కపూర్కి ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఇంకా ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు.
బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ కెరీర్ లో వస్తున్న సినిమా కావడంతో సాహోపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని విదంగా ఒళ్ళు గగ్గర్లు పొడిచే యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని అంటోంది చితయూనిట్.