Don't Miss!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- News సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లేవారికి గుడ్ న్యూస్
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
'సాహో' కోసం వదిలేయక తప్పలేదు.. అందుకే.. ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా సినిమా 'సాహో'. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకొని ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఆగస్టు 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ సినిమా విశేషాలను తెలుపుతూ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు.
భారీ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా రాబోతున్న 'సాహో' కోసం శాఖాహారిగా మారారట ప్రభాస్. యాక్షన్ సీక్వెన్స్ చేయాలంటే కాస్త సన్నబడాలని యూనిట్ సూచించడంతో.. బరువు తగ్గేందుకై పూర్తిగా వెజిటేరియన్ గా మారానని ప్రభాస్ అన్నారు. దాదాపు ఐదు నెలల పాటు శాఖాహారమే తీసుకున్నానని ఆయన తెలిపారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్పై దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్తో హై టెక్నికల్ వాల్యూస్తో తెరకెక్కింది సాహో సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. హీరోయిన్ శ్రద్ద కపూర్కి ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఇంకా ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు.
బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ కెరీర్ లో వస్తున్న సినిమా కావడంతో సాహోపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని విదంగా ఒళ్ళు గగ్గర్లు పొడిచే యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని అంటోంది చితయూనిట్.