Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
ఫుల్ బిజీగా మారిన ప్రకాష్ రాజ్.. అన్ని చోట్లా అతనే
ఇండియన స్క్రీన్పై ఎలాంటి పాత్రలు వేయాలన్నా ప్రకాష్ రాజ్ ముందుంటాడు. అన్ని భాషల్లో అన్ని రకాల పాత్రలు చేసిన ప్రకాష్ రాజు ప్రస్తుతం రాజకీయంగానూ బిజీగానే ఉన్నాడు. గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిపోయిన ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో ప్రభుత్వాలను ప్రశ్నిస్తుంటాడు. సమాజంలో జరిగే అన్యాయాలపై చురకలంటించినట్టుగా ప్రశ్నలు సంధిస్తుంటాడు. అయితే కొన్ని సార్లు ప్రకాష్ రాజ్పైన ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది.
లాక్డౌన్లో ఫాంహౌస్లో వ్యవసాయం చేసుకుంటూ ఉన్న ప్రకాష్ రాజ్ చేతనైన సాయం చేసుకుంటూ వచ్చాడు. మళ్లీ ఇప్పుడు తన రొటీన్ లైఫ్లో బిజీ అవుతున్నాడు. అన్ లాక్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ప్రకాష్ రాజ్ బిజీగానే ఉంటున్నాడు. అల్లుడు అదుర్స్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ప్రకాష్ రాజ్ మొన్నటి వరకు క్లాప్ సినిమాతో గడిపేశాడు. తాజాగా మళ్లీ విశాల్ సినిమా సెట్లోకి వచ్చేశాడు. ఇలా ప్రతీ చోటా ప్రకాష్ రాజ్ సందడే కనిపిస్తోంది.
విశాల్ ఆర్య కలిసి నటిస్తున్న మూవీకి సంబంధించిన టైటిల్ పోస్టర్ నిన్ననే రిలీజ్ చేశారు. నా బెస్ట్ ఫ్రెండ్ ఆర్య.. ఇప్పుడు నా ఎనిమీ అయ్యాడు అంటూ విశాల్ ట్వీట్ చేస్తూ మూవీ టైటిల్ లోగోను విడుదల చేశాడు. తాజాగా ఈ మూవీ సెట్లోకి ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మేరకు చిత్రయూనిట్ ప్రకాష్ రాజ్కు ఘన స్వాగతం పలికింది. వాడు వీడు సినిమా తరువాత ఆర్య విశాల్ కాంబోలో రాబోతోన్న ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.