Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కృష్ణంరాజు టాలెంట్ పై ప్రభాస్ చెల్లి స్పెషల్ వీడియో.. వాసన చూసే ఆ విషయాన్ని పట్టేస్తారట!
రెబల్ స్టార్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్ చేసిన కృష్ణంరాజు అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఎంతగానో గౌరవిస్తారు. ముఖ్యంగా వారు ఇచ్చే మారియాదలకు ఎవరైనా సరే ఫ్యాన్ అవ్వాల్సిందే. ఎవరు ఇంటికి వచ్చిన సమయానికి కాడుపునిండా భోజనం పెట్టి ప్రేమతో పంపించేస్తారని ప్రతి ఒక్కరు చెబుతుంటారు. రాజుల వంశానికి చెందిన కృష్ణంరాజు, ప్రభాస్ ఇద్దరు కూడా ఫుడ్ ని ఎంజాయ్ చేయడంలో రాయల్ గా ఉంటారనే కామెంట్స్ కూడా వస్తుంటాయి.
వీకెండ్ స్పెషల్ వంటకం
ఇక ఇటీవల ప్రభాస్ చెల్లి అంటే కృష్ణంరాజు పెద్ద కూతురు ప్రసీద ఒక స్పెషల్ విడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నాన్న వీకెండ్ స్పెషల్ వంటకం అంటూ పోస్ట్ చేసిన ఆ వీడియోలో కృష్ణం రాజు చేపల పులుసు వండుతూ ఒక విధంగా అందరి నోళ్లు ఊరింపజేశారు. సాధారణ రోజుల్లోనే అద్భుతమైన వంటకాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ఇక వీకెండ్ అంటే అంతకు మించి అనేలా ఉంటుందట.
|
వాసన చూసి పసిగట్టే టాలెంట్
చేపల పులుసులో ఉప్పు సరిపోయిందో లేదో అనే విషయం కరెక్ట్ గా తెలియాలి అంటే వాసన చూసి పసిగట్టే టాలెంట్ ఉండాలని కృష్ణంరాజు చెప్పారు. ఆయన కూకింగ్ చేస్తూ చెప్పిన విధానం నెటిజన్స్ ని ఎంతగనో ఆకట్టుకుంటోంది. అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తూ వీడియోని మరింత వైరల్ అయ్యేలా చేస్తున్నారు.
నాన్న ప్రపంచంలోనే ది బెస్ట్
ప్రసీద వివరణ ఇస్తూ.. 'వీకెండ్ స్పెషల్.. ఫిష్ పులుసు చేయడంలో మా నాన్న ప్రపంచంలోనే ది బెస్ట్ అని చెప్పవచ్చు. అలాగే ఆయన పులుసులో ఉప్పు సరిపోయిందో లేదో రుచి చూడకుండానే చెప్పగలరు. కేవలం వాసన చూసి చెబుతారు. అందులో ఎలాంటి పొరపాటు ఉండదు అని పేర్కొంది.
Recommended Video
ప్రసీద ప్లాన్ మామూలుగా లేదు
ఇక ప్రసీద సినిమా ఇండస్ట్రీలోకి ఒక నిర్మాతగా ఎంట్రీ ఇవ్వనుంది. రాధేశ్యామ్ సినిమాను యూవీ క్రియేషన్స్, టి- సిరిస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే అందులో ప్రసీద కూడా ఒక సహా నిర్మాతగా ఉన్నారు. భవిష్యత్తులో ప్రసీద చిన్న బడ్జెట్ లో మరిన్ని సినిమాలను నిర్మించాలని ఒక ప్లాన్ వేసుకుంటున్నట్లు సమాచారం.